సుక్మా జిల్లాలో దారుణం.. జాతర చూసేందుకు వచ్చిన జవాన్ హత్య..

Published : Mar 27, 2022, 11:20 AM IST
సుక్మా జిల్లాలో దారుణం.. జాతర చూసేందుకు వచ్చిన జవాన్ హత్య..

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ జవాన్ దారుణ హత్యకు గురయ్యాడు. జవాన్ బోదరాస్‌లో జాతర చూసుకునేందుకు వచ్చిన సమయంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ జవాన్ దారుణ హత్యకు గురయ్యాడు. జవాన్ బోదరాస్‌లో జాతర చూసుకునేందుకు వచ్చిన సమయంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. వివరాలు.. హత్యకు గురైన జవాన్ సుక్మా జిల్లా కుకనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదరస్ ప్రాంతానికి చెందినవాడు. అతడు జాతర చూసేందుకు బోదరస్ వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. అయితే శనివారం జవాన్ హత్యకు గురయ్యాడని తెలిపారు. మావోయిస్టులే ఈ దారుణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకన్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మనీష్ మిశ్రా ఘటన స్థలాన్ని సందర్శించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

IRCTC Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర క్రేజీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే !
జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi