జమ్మూ జంట పేలుడు నిందితుడి అరెస్ట్.. తొలిసారి  'పెర్ఫ్యూమ్ ఐఈడీ' స్వాధీనం.. 

Published : Feb 03, 2023, 05:49 AM ISTUpdated : Feb 03, 2023, 05:50 AM IST
జమ్మూ జంట పేలుడు నిందితుడి అరెస్ట్.. తొలిసారి  'పెర్ఫ్యూమ్ ఐఈడీ' స్వాధీనం.. 

సారాంశం

లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని జమ్మూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాది పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్‌లతో 3 సంవత్సరాలుగా సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇతడే నర్వాల్ ఘటనకు పాల్పడ్డాడు.

జమ్మూ పోలీసులు మొదటిసారిగా లష్కరే తోయిబాకు చెందిన అరెస్టయిన ఉగ్రవాది నుండి పెర్ఫ్యూమ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి)ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్రవాది జనవరి 21న నర్వాల్‌లో జరిగిన జంట పేలుళ్లలో పాల్గొన్నాడు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మీడియాకు వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ప్రకారం.. "అరెస్టయిన ఉగ్రవాదిని ఆరిఫ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఉగ్రవాది 3 సంవత్సరాలుగా పాకిస్తానీ హ్యాండ్లర్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆధారాలున్నాయని తెలిపారు. అలాగే.. జనవరి 20న రెండు బాంబులు పెట్టామని.. జనవరి 21న 20 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిపి వీలైనంత ఎక్కువ మందిని హతమార్చామని నిందితుడు తెలిపాడని పేర్కొన్నారు.

గత నెలలో నార్వాల్‌లో జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీలైనంత ఎక్కువ మందిని చంపడమే ఉగ్రవాదుల ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ఇంకా మాట్లాడుతూ..పోలీసులు స్వాధీనం చేసుకున్న తొలి ఐఇడి ఇదేనని, ఐఇడిని అణచివేయడానికి లేదా తెరవడానికి ప్రయత్నిస్తే అది పేలుతుందని చెప్పారు.    

పాకిస్థాన్ తన గడ్డపై నుంచి ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తోందని డీజీపీ సింగ్ విమర్శించారు. " ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది అమాయక ప్రజలను చంపడంలో పాకిస్తాన్ అపఖ్యాతి పాలైంది. గత కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్ ను లక్ష్యంగా చేసుకున్నారనీ,  ప్రజల మధ్య మతపరమైన విభజనను సృష్టించాలనుకుంటున్నారని తెలిపారు. జంట పేలుళ్లతో పాటు శాస్త్రి నగర్ పేలుడు, కత్రా బస్సు పేలుళ్లలో కూడా ఆరిఫ్ నర్వాల్ హస్తం ఉందని డీజీపీ తెలిపారు. నిందితుడు డిసెంబర్ చివరిలో మూడు IEDలను సరఫరా చేసాడనీ, అతను నార్వాల్ ప్రాంతంలో రెండు IEDలను ఉపయోగించాడని తెలిపాడు. ఆరిఫ్ నర్వాల్ .. పాకిస్తాన్‌కు చెందిన LeT కార్యకర్త అయిన ఖాసిం ఆధ్వర్యంలో పని చేస్తున్నాడని, అతను ఒక ఇ-తైబా (లష్కరే తాయిబా) ఉగ్రవాది.. ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనలకు అతడే బాధ్యత వహిస్తాడని తెలిపారు. 

ఖండించిన ఎల్జీ మనోజ్ సిన్హా

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా గురువారం (ఫిబ్రవరి 2) ఉదయం నర్వాల్ ప్రాంతంలో జరిగిన పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. సీనియర్ పోలీసు అధికారులు పేలుడు , దర్యాప్తు పరిస్థితుల గురించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు వివరించారు. పేలుడుకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పేలుడులో గాయపడిన వారికి ఎల్‌జీ మనోజ్ సిన్హా రూ.50,000 సాయం ప్రకటించారు.

ఇదిలా ఉండగా..  జనవరి 21న పేలుళ్లు జరిగిన వెంటనే.. ఆర్మీ సీనియర్ అధికారులు, సెక్యూరిటీ ఇంపాక్ట్ అనాలిసిస్-ఎస్‌ఐఏ బృందాలు కూడా ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. జనవరి 22న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-NIA బృందం కూడా జమ్మూలోని నర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో రెండు పేలుళ్లు జరిగిన ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేసింది.

ఈ బాధాకరమైన సంఘటనను పేలుడు ప్రత్యక్ష సాక్షి షెరాలీ మీడియాతో మాట్లాడుతూ.. 'పేలుడు జరిగిన సమయంలో మేం ఓ దుకాణంలో కూర్చున్నాం. కారు పేలడంతో కారులోని కొన్ని భాగాలు దుకాణం సమీపంలో పడిపోయాయి. అరగంట తర్వాత కొంత దూరంలో రెండో పేలుడు సంభవించింది. మొదట్లో కారులో గ్యాస్‌ పేలుడు జరిగిందని భావించాం.. అయితే దాని శబ్దం అంతకంటే ఎక్కువ ఉంది. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని  అన్నారు.

PREV
click me!

Recommended Stories

Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు| Asianet News Telugu
ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?