
దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో వరుసగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.తాజాగా జమ్మూ కాశ్మీర్లోని దోడా, లడఖ్ ప్రాంతాల్లో రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని దోడా, లడఖ్ ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవించాయి. దీంతో ఇక్కడి నివాసితులు భయాందోళనలకు గురవుతున్నారు. శనివారం సాయంత్రం జమ్మూకశ్మీర్, లడఖ్లో భూకంపం సంభవించింది. లడఖ్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో 10 నిమిషాల తర్వాత భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. లడఖ్లో రాత్రి 9:44 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5 గా నమోదైంది. అలాగే.. దోడాలో భూకంపం 10 నిమిషాల తర్వాత రాత్రి 9:55 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.4గా నమోదైంది. లడఖ్లో భూకంప కేంద్రం లేహ్కు 271 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే సమయంలో దోడాలో భూకంపం యొక్క కేంద్రం భూమిలో 18 కి.మీ. అలాగే.. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
అంతకుముందు జమ్మూకశ్మీర్లోని కొండ ప్రాంతాలలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. గత ఐదు రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో ఏడు సార్లు భూమి కంపించినట్టు తెలుస్తోంది. భూకంపాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ చాలా సున్నితంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా దోడా, కిష్త్వార్, రాంబన్లలో వారం నుండి ప్రకంపనలు సంభవిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3గా నమోదైంది. దాని కేంద్రం రాంబన్లో భూమికి ఐదు కిలోమీటర్ల దిగువన ఉంది. నిరంతరాయంగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున రాంబన్, కాశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న దోడా జిల్లాలో భూకంపం కారణంగా ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇద్దరు బాలికలు గాయపడ్డారు. దీని తరువాత (జూన్ 14) గురువారం ఐదు సార్లు ప్రకంపనలు సంభవించాయి.