కుల దురహంకారం.. దళిత ఉద్యోగి చేత కాళ్లు మొక్కించుకున్న పెద్ద మనిషి

Siva Kodati |  
Published : Aug 08, 2021, 04:36 PM IST
కుల దురహంకారం.. దళిత ఉద్యోగి చేత కాళ్లు మొక్కించుకున్న పెద్ద మనిషి

సారాంశం

తమిళనాడులో కుల దురహంకారం ప్రదర్శించాడో వ్యక్తి. ఓ దళిత ప్రభుత్వ ఉద్యోగిని అత్యంత దారుణంగా అవమానించాడు. కోయంబత్తూరులోని అన్నూర్ పంచాయతీలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ముత్తుస్వామిపై దౌర్జన్యానికి దిగాడు గోపాల స్వామి అనే వ్యక్తి. 

తమిళనాడులో కుల దురహంకారం ప్రదర్శించాడో వ్యక్తి. ఓ దళిత ప్రభుత్వ ఉద్యోగిని అత్యంత దారుణంగా అవమానించాడు. కోయంబత్తూరులోని అన్నూర్ పంచాయతీలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ముత్తుస్వామిపై దౌర్జన్యానికి దిగాడు గోపాల స్వామి అనే వ్యక్తి. కులం పేరుతో దూషించడంతో పాటు తన కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో తన పలుకుబడితో ఉద్యోగం తీయించేస్తానని బెదిరించాడు. దీంతో అతని కాళ్ల మీద క్షమాపణ చెప్పాడు ముత్తుస్వామి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరిగింది? | Asianet News Telugu
తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ జోరుగా ప్రచారం| Asianet News Telugu