ప్రయాణీకురాలికి గుండెపోటు.. జోధ్ పూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కానీ.. అప్పటికే.. 

Published : Feb 08, 2023, 06:22 AM IST
ప్రయాణీకురాలికి గుండెపోటు.. జోధ్ పూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కానీ.. అప్పటికే.. 

సారాంశం

జెద్దా నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్ర‌యాణీకురాలు అస్వ‌స్ధ‌త‌కు గురికావ‌డంతో జోథ్‌పూర్ వ‌ద్ద విమానం అత్య‌వసరంగా ల్యాండ్ అయింది. జోథ్‌పూర్‌లోని గోయ‌ల్ ఆస్ప‌త్రి, ప‌రిశోధ‌న కేంద్రానికి ఆమెను త‌ర‌లించి చికిత్స అందించారు.

ఇండిగో విమానంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నాడు జెడ్డా నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఓ  ప్రయాణికురాలి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో విమానాన్ని జోధ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. హుటాహుటినా.. ఆ ప్రయాణికురాలిని జోధ్‌పూర్‌లోని గోయల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ.. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

ప్రయాణికురాలిని జమ్మూ కాశ్మీర్‌లోని హజారీబాగ్‌కు చెందిన మిత్రా బానో(61)గా గుర్తించారు. ప్రయాణ సమయంలో ఆమెతో పాటు ఆమె కొడుకు కూడా ఉన్నాడు. ఈ విషయంలో.., విమానంలో ఉన్న ఒక వైద్యుడు ప్రయాణీకుడికి తక్షణ ప్రథమ చికిత్స అందించడంలో సిబ్బందికి సహాయం చేశారని ఇండిగో తెలిపింది. దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రయాణికురాలు మరణించింది.

వార్తా సంస్థ PTI నివేదించిన ప్రకారం.. ఉదయం 10:30 గంటలకు ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. వెంటనే ప్రయాణికురాలు బానోను వైద్య బృందం జోధ్‌పూర్‌లోని గోయల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తీసుకెళ్లిందని అధికారులను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది.

విమానంలో ఉన్న వైద్యుడు ప్రయాణీకురాలికి తక్షణ ప్రథమ చికిత్స అందించడానికి సిబ్బందికి సహాయం చేశారని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. అదనంగా.. విమానయాన సంస్థలు మిత్రా బానో యొక్క కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేసాయి. జోధ్‌పూర్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడు బానో కుమారుడు మీర్ ముజఫర్ ఆమెతో ఉన్నాడు. "నా తల్లి తన ఛాతీలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసింది. నేను వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చాను , జోధ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయాలి " అని అతను చెప్పాడు.

ఆసుపత్రి వర్గాల ప్రకారం.."మహిళకు గుండెపోటు రావడం వల్ల చనిపోయింది. తాము చట్టబద్ధమైన లాంఛనాలు నిర్వహించాము. ఆమె మృతదేహాన్ని రోడ్డు మార్గంలో ఇంటికి తీసుకెళ్లేందుకు వీలుగా ఆమె కొడుకు కోసం రవాణాను ఏర్పాటు చేసాము." విమానం గంటకు పైగా ఎయిర్‌పోర్టులో ఉండి ఢిల్లీకి బయలుదేరిందని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu