ఏడుగురు పసికందులను పొట్టనబెట్టుకున్న కిరాతకురాలు.. నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు..

Published : Aug 19, 2023, 05:44 PM ISTUpdated : Aug 19, 2023, 06:03 PM IST
ఏడుగురు పసికందులను పొట్టనబెట్టుకున్న కిరాతకురాలు.. నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు..

సారాంశం

ఏడుగురు నవజాత శిశువులను చంపి, 6 మందిని హత్య చేయడానికి ప్రయత్నించిన నర్సును పట్టుకోవడంలో బ్రిటన్‌లో జన్మించిన భారత సంతతికి చెందిన డాక్టర్ కీలక పాత్ర పోషించారు. ఈ హృదయ విదారక సంఘటన ఇంగ్లాండ్‌లో వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేసిన లూసీ లెట్బీ హత్య, హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది.

ఓ నర్సు తన వైద్య వృత్తికే కాదు.. మానవత్వానికి కూడా మచ్చ తెచ్చింది. ముక్కు పచ్చలారని పసికందులను పొట్టనబెట్టుకుంది. దాదాపు ఏడుగురు నవజాత శిశువులను చంపి, మరో ఆరుగురు చిన్నారులను హత్య చేయడానికి ప్రయత్నించింది. ఈ హృదయ విదారక సంఘటన ఇంగ్లాండ్‌లో వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేసిన లూసీ లెట్బీ ఏడుగురు నవజాత శిశువులను హత్య,  హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది. 

ఆ రాక్షసిని పట్టించడంతో భారత సంతతి వైద్యుడు రవి జయరాం కీలకంగా వ్యవహరించాడు. ఆయన ఆ నర్సు దారుణాలను గుర్తించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సందర్భంగా ఈ దారుణానికి ఒడిగట్టిన నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు రవి జయరాం కీలక విషయాలను వెల్లడించారు. నర్సు గురించి తాను ముందే హెచ్చరించానని, అప్పుడే గుర్తించి ఉంటే.. ఆ పసికందుల ప్రాణాలు   కాపాడగలిగేవాళ్లమని విచారం వ్యక్తం చేశారు భారత సంతతికి చెందిన డాక్టర్ రవి జయరామ్.

ఇంగ్లాండ్‌ (England)లోని  బ్రిటన్‌లోని చెస్టర్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో 2015-16లో ప్రాంతంలో ఈ దారుణాలు జరిగాయి. పనికందుల వార్డులో పనిచేస్తున్న లూసీ లెట్బీ (33) అనే నర్సు అప్పుడే పుట్టిన పిల్లలను చంపినట్టు తేలడంతో ఆమెను దోషిగా నిర్దారించారు. లూసీని పట్టించడంలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్ జైరామ్ సహా ఇతర వైద్యులు చేసిన ఫిర్యాదుతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే ఆసుపత్రిలో జయరాం పిల్లల డాక్టర్ గా పనిచేస్తున్నారు.  

తీర్పు అనంతరం  భారత సంతతి చెందిన వైద్యులు రవి జయరాం మీడియాతో మాట్లాడుతూ..  హత్యకు గురైన పిల్లలు బతికి ఉంటే...ఈరోజు ఆ పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే వారు. 2015 జూన్‌లో ముగ్గురు నవజాత శిశువులు మరణించినప్పుడు.. దాని గురించి తాను ఆందోళన వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. ఎక్కువ మంది పిల్లలు చనిపోతే.. నా తోటి సీనియర్ వైద్యులు కూడా సమావేశాలు నిర్వహించి ఆసుపత్రి పాలకవర్గ అధికారులతో ఆందోళన వ్యక్తం చేశామని తెలిపారు. ఈ విషయంలో పోలీసులను కలిసేందుకు 2017 ఏప్రిల్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ అనుమతించిందని డాక్టర్ జైరాం తెలిపారు.

చిన్నారుల అనుమానాస్పద మరణాల గురించి తాము పోలీసులకు చెప్పడంతో.. పోలీసులు దానిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు విచారణలో నర్స్ లూసీపై తొలిసారి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని  తాము ఆసుపత్రి అధికారులకు చెప్పాం. కానీ, వారు తమని నమ్మలేదు. సహోద్యోగిపై అనవసర ఆరోపణలు చేయొద్దని,ఆ నర్పుకు క్షమాపణ చెప్పాలని తమకు సూచించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు బలవంతం చేశారు. ఆమెకు క్షమాపణ చెబుతూ.. లెటర్ రాశామని తెలిపారు. విచారణ, వివరణాత్మక విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేశారు.

నవజాత శిశువులను చంపడానికి లూసీ వివిధ పద్ధతులను అవలంబించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. 2015 నుంచి 2016 మధ్య కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో 13 మంది నవజాత శిశువుల పరిస్థితి క్షీణించిందని, అందులో ఏడుగురు మరణించారని, ఆరుగురిని చాలా కష్టంతో రక్షించగలిగామని తెలిపారు. పిల్లలను చంపేందుకు ఆ నర్సు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయడం, నరాల్లోకి గాలి నింపడం, అధిక మోతాదులో పాలు ఇవ్వడం వంటి పద్ధతులను ఉపయోగించినట్లు విచారణలో తేలింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌