
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ -21 యుద్ధ విమానం ఒకటి ప్రమాదానికి గురైంది. గురువారం అర్థరాత్రి దటాక పంజాబ్ రాష్ట్రంలోని మోగా వద్ద విమానం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో పైలెట్, స్క్వాడ్రోన్ లీడర్ అభినవ్ చౌదరి మృతి చెందినట్లుగా ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్ లో ప్రకటించింది.
సుమారు రాత్రి ఒంటిగంట సమయంలో వెస్ట్రన్ సెక్టార్ లో లాంగియానా ఖుర్ద్ గ్రామంలో మిగ్ బైసన్ విమానం కూలిపోయినట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన మీద దర్యాప్తుకు ఆదేశించినట్లు భారత వైమాని దళం అధికారులు చెప్పారు.
కాగా అభినవ్ కుటుంబానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంతాపం తెలిపింది. అయితే ఈ యేడాది మిగ్ యుద్ధ విమానాల ప్రమాదాల్లో ఇది మూడోది. జనవరి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలో సూరత్ ఘడ్ వద్ద విమానం కూలిపోయింది.
ఈ ఘటనలో పైలెట్ సురక్సితంగా బయటపడ్డారు. మార్చినెలలో ఎయిర్ బేస్ వద్ద మిగ్ బైసన్ విమాన ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ గుప్తా చనిపోయారు. ట్రైనింగ్ కోసం విమానం బయల్దేరినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘనటమీద దర్యాప్తు కొనసాగుతోంది.