ఇండియాలో ఒక్క రోజులోనే 40 శాతం పెరుగుదల: రికవరీ కంటే కరోనా కొత్త కేసులే ఎక్కువ

Published : Jul 21, 2021, 10:34 AM IST
ఇండియాలో ఒక్క రోజులోనే 40 శాతం పెరుగుదల: రికవరీ కంటే కరోనా కొత్త కేసులే ఎక్కువ

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు 40 శాతం పెరిగాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే  40 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.


న్యూఢిల్లీ:ఇండియాలో కరోనా కేసులు అంతకుముందు  రోజుతో పోలిస్తే పెరిగాయి. అయితే కేసుల సంఖ్య 40 శాతం పెరిగినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.మంగళవారం నాడు దేశంలోని 18,52,140 మందిని పరీక్షిస్తే  42,015 మందికి కరోనా సోకినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య తెలిపింది. అంతకుముందు రోజు దేశంలో 30 వేల కరోనా కేసులు  నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 3,998 మంది కరోనాతో మరణించారు. 

దేశంలో కరోనా కేసులు 3.12 కోట్లకు చేరుకొన్నాయి. కరోనాతో  ఇప్పటివరకు ఇండియాలో 4.18 లక్షల మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఇంకా 4,07,170 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.  నిన్న ఒక్క రోజే కరోనా నుండి 36,977 మంది కోలుకొన్నారు. దేశంలో యాక్టివ్ కేసుల  రేటు 1.30 శాతంగా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 97.36 శాతానికి చేరుకొంది. నిన్న ఒక్క రోజే 34,25,446 మంది వ్యాక్సిన్ వేసుకొన్నారు.  ఇప్పటివరకు దేశంలో 41,54,72,455 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo