Bharat-RBI: నికర విదేశీ పెట్టుబడుల్లో 96.5% భారీ పతనం..గతేడాదితో పోలిస్తే ఎంత తగ్గిందంటే..!

Published : May 24, 2025, 12:40 PM IST
RBI new rule minors

సారాంశం

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు వచ్చిన నికర విదేశీ పెట్టుబడి కేవలం $353 మిలియన్లే, గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గిందని RBI వెల్లడించింది.

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో భారత్‌కు వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయినట్టు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) తాజా గణాంకాల్లో వెల్లడించింది. నికర FDI కేవలం $353 మిలియన్లకు పరిమితమైందిగా సమాచారం. ఇది ఇప్పటివరకు నమోదైన అతి తక్కువ స్థాయి ఫలితాలు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో ఈ సంఖ్య $10 బిలియన్లకు చేరిందని RBI పేర్కొంది.

ఈ పెట్టుబడి క్షీణతకు ప్రధానంగా ఇండియాలో ఐపిఓ (IPO) మార్కెట్ జోరందుకోవడమే కారణంగా పేర్కొనబడింది. IPOల వృద్ధి కారణంగా కొన్ని దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడిదారులు—ముఖ్యంగా ఆల్ఫా వేవ్ గ్లోబల్, పార్టనర్స్ గ్రూప్ లాంటి సంస్థలు—తమ వాటాలను విక్రయించి మార్కెట్ నుంచి నిష్క్రమించాయి. హ్యుందాయ్ మోటార్, స్విగ్గీ వంటి భారతీయ కంపెనీల్లో వాటాలను అమ్మి, ఈ సంస్థలు బిలియన్ల డాలర్ల లాభాలను స్వదేశాలకు తరలించాయి.

అలాగే, భారతీయ సంస్థల బాహ్య పెట్టుబడులు పెరగడం, అదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును తిరిగి తేలికగా స్వదేశాలకు పంపించుకోవడం వంటి అంశాలు కూడా ఈ తగ్గుదలకు దారితీశాయి. విదేశాలకు తిరిగి పంపిన పెట్టుబడి మొత్తాలు ఈ ఆర్థిక సంవత్సరంలో $49 బిలియన్లను తాకినట్టు RBI తెలిపింది. ఇది గత ఏడాది నమోదైన $41 బిలియన్ల కంటే గణనీయంగా ఎక్కువ.

ఈ గణాంకాలు చూస్తే, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం కొంతవరకూ తగ్గినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యూహాలను ఎలా మెరుగుపరుస్తారన్నది కీలకమవుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu