ప్రణబ్ ముఖర్జీ మృతి: ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

Published : Aug 31, 2020, 08:12 PM IST
ప్రణబ్ ముఖర్జీ మృతి: ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

సారాంశం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇవాళ్టి నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడు రోజుల పాటు జాతీయ పతాకాలను అవనతం చేయనున్నారు. అంత్యక్రియలు ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని తర్వాత ప్రకటించనున్నట్టుగా తెలిపారు.

also read:కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి: ప్రణబ్ కీలక పాత్ర

రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్రం ఆదేశించింది.అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది.

అనారోగ్యంతో ఈ నెల మొదటివారంలో ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించాడు. ప్రణబ్ ముఖర్జీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా పేరుంది.కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ప్రణబ్ కు పేరుంది. 
 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu