2022-23లో విపత్తుల్లో 1,997 మంది మృతి.. 18,54,901 హెక్టార్లలో పంట నష్టం : కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్

Published : Mar 15, 2023, 11:06 AM IST
2022-23లో విపత్తుల్లో 1,997 మంది మృతి.. 18,54,901 హెక్టార్లలో పంట నష్టం : కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్

సారాంశం

New Delhi: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ డేటా పూర్తిగా భద్రంగా ఉందని ప్రభుత్వం  తెలిపింది. సున్నితమైన డేటా భద్రతకు సంబంధించి ఎలాంటి లోపాలు కనిపించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. అలాగే, ప్ర‌కృతి విప‌త్తుల కార‌ణంగా 2022-23 లో 1,997 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు.   

Minister of State (MoS), Home Nityanand Rai: 2022-2023 సంవత్సరంలో జ‌ల సంబంధ వాతావరణ విపత్తుల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 1,997 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 30,615 పశువులు, 18,54,901 హెక్టార్ల పంటలు, 3,24,265 ఇళ్లు, గుడిసెలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలు అందించిన సమాచారాన్ని ఉటంకిస్తూ, ఈ వివరాలలో 2022-23లో సంభవించిన హైడ్రో-వాతావరణ విపత్తుల వల్ల 2023 మార్చి 7 నాటికి సంభవించిన నష్టాలు కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు. అయితే వివిధ వాతావరణ సంఘటనల వల్ల సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, నష్టాలు, నష్టాలపై రాష్ట్రాల వారీగా సమాచారాన్ని మంత్రిత్వ శాఖ నిర్వహించడం లేదని రాయ్ స్పష్టం చేశారు.

మ‌హారాష్ట్రలో అత్య‌ధిక మ‌ర‌ణాలు.. 

మహారాష్ట్రలో విపత్తుల కార‌ణంగా అత్యధికంగా 438 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత స్థానంలో  మధ్యప్రదేశ్ (284), అసోం (200), గుజరాత్ (189), కర్ణాటక (127), ఛత్తీస్ గఢ్ (95), రాజస్థాన్ (91), ఉత్తరాఖండ్ (86), బీహార్ (70), మణిపూర్ (53), ఉత్తరప్రదేశ్ (53), హిమాచల్ ప్రదేశ్ (42), తెలంగాణ (39), అరుణాచల్ ప్రదేశ్ (27), మేఘాలయ (27) లు ఉన్నాయి.  అలాగే, పంజాబ్ లో 22 మంది, తమిళనాడు, జమ్మూకశ్మీర్ ల‌లో 16 మంది చొప్పున, త్రిపురలో 13, ఒడిశాలో 11, నాగాలాండ్ 10, సిక్కింలో 8, ఆంధ్రప్రదేశ్ లో 7, గోవాలో ఒక‌రు ఈ విప‌త్తుల కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు.

నాగాలాండ్ లో ప‌శువుల మ‌ర‌ణాలు అధికం..

అలాగే, 2022-2023లో సంభ‌వించిన‌ ఈ విపత్తుల్లో నాగాలాండ్ లో 14,077, మహారాష్ట్రలో 4,301 పశువులు మరణించాయి. ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్న అసోంలో 2043, తెలంగాణలో 1,574, గుజరాత్ లో 1,457,  కర్ణాటకలో 1,289, పుదుచ్చేరిలో 999, కేరళలో 997, హిమాచల్ ప్రదేశ్ లో 940, ఛత్తీస్ గ‌ఢ్ లో 533, తమిళనాడులో 508, ఉత్తరాఖండ్ లో 407, ఆంధ్రప్రదేశ్ లో 291, ఒడిశాలో 229, పంజాబ్ లో 203, రాజస్థాన్ లో 184, మేఘాలయలో 167,  కేరళలో 161,  సిక్కింలో 137, ఉత్తరప్రదేశ్ లో 68, ఆంధ్రప్రదేశ్ లో 49 ప‌శువులు చ‌నిపోయాయి. ఈ విపత్తుల్లో అసోంలో అత్యధికంగా 2,02,214 ఇళ్లు, గుడిసెలు దెబ్బ‌తిన్నాయ‌ని ప్ర‌భుత్వ డేటా పేర్కొంది. కర్ణాటకలో 45,465 ఇళ్లు, గుడిసెలు ధ్వంసమయ్యాయి. వీటి త‌ర్వ‌త‌ తెలంగాణలో 14,858, ఆంధ్రప్రదేశ్ లో 13,573, ఒడిశాలో 9,693, గుజరాత్ లో 6,762, మధ్యప్రదేశ్ లో 6,646 ఇళ్లు, గుడిసెలు దెబ్బ‌తిన్నాయి.

ల‌క్ష‌ల హెక్టార్లలో పంట‌న‌ష్టం.. 

జల-వాతావరణ వైపరీత్యాల కార‌ణంగా ల‌క్ష‌ల హెక్టార్ల‌లో పంట న‌ష్టం జ‌రిగింది. అత్య‌ధికంగా కర్ణాటకలో 10,06,455 హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ లో 2,13,018 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. తమిళనాడులో 1,53,011,  ఒడిశాలో 1,36,233,  అసోంలో 1,14,797, పంజాబ్ లో 82,727, గుజరాత్ లో 82,532, బీహార్ లో 37 వేలు,  మేఘాలయలో 11,814, ఆంధ్రప్రదేశ్ లో 6,928 హెక్టార్లలో పంటలు దెబ్బ‌తిన్నాయి.

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu