Monsoon Rains: రాబోయే 2-3 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: IMD

Published : May 28, 2022, 06:26 AM IST
Monsoon Rains:  రాబోయే 2-3 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: IMD

సారాంశం

Monsoon Rains: నైరుతి రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం నెలకుందని, మరో రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) శుక్రవారం ప్రకటించింది. తొలుత మే 27నే రుతుపవనాలు కేరళను తాకుతాయని నిపుణులు అంచనా వేశారు. కానీ ప్ర‌తికూల ప్ర‌భావం వ‌ల్ల రుతుప‌వ‌నాలు నెమ్మ‌దించాయి.  

Monsoon Rains: నైరుతి రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడింద‌నీ,  రాబోయే రెండు మూడ్రోజుల్లో కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం(IMD) శుక్రవారం పేర్కొన్నది. ఈ ఏడాది కాస్త ముందుగానే రుతు పవ‌నాలు భార‌త్ కు చేరుకుంటాయ‌ని అంచ‌నా వేశారు.  కానీ,  పరిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో రుతుపవనాలు నెమ్మదించాయి. ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ గాలులు బలపడ్డాయని, రానున్న 48 గంటల్లో  మాల్దీవులు, లక్షద్వీప్‌ పరిసరాలతో పాటు కొమరిన్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది. అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలపడి  రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే  అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది.  

 భారత వాతావరణ శాఖ(IMD) అధికారి మాట్లాడుతూ.. "తాజా వాతావరణ సూచనల ప్రకారం, దక్షిణ అరేబియా సముద్రం మీదుగా దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు బలపడ్డాయ‌ని తెలిపారు. ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. కేరళ తీరం, ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతం మేఘావృతమైంది. అందువల్ల  వచ్చే 2-3 రోజులలో కేరళలో రుతుపవనాల ప్రారంభం జ‌రుగుతోంద‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం,  లక్షద్వీప్ ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD త‌న వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది.

ఈశాన్య భారతదేశంలో చాలా విస్తృతంగా తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని,    బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ & సిక్కింలలో ఒక్కో చోట ఉరుములు,  మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.  

రాబోయే మూడు రోజుల్లో వాయువ్య, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరుగుతాయని, ఆ తర్వాత గణనీయమైన మార్పు ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకారం.. శని, ఆదివారాల్లో పశ్చిమ రాజస్థాన్‌లో హీట్‌వేవ్ పరిస్థితులు ఏర్ప‌డే అవకాశం ఉందని తెలిపింది.

పశ్చిమ డిస్ట్రబెన్స్ ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో అక్కడక్కడా ఉరుములు లేదా మెరుపులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాగే..రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, ఉత్తర హర్యానా, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లలో తేలిక‌పాటి వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌లో శనివారం వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది.
 .
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా రుతుపవనాలు గత నెలలో వేగం పుంజుకున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు