కరోనా ఎఫెక్ట్: ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షల వాయిదా

Published : Apr 18, 2021, 12:15 PM IST
కరోనా ఎఫెక్ట్: ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షల వాయిదా

సారాంశం

కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ మాసంలో నిర్వహించాల్సిన  ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశారు. 

న్యూఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ మాసంలో నిర్వహించాల్సిన  ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్  ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను  ఈ నెల 27 నుండి  30 వరకు నిర్వహించాలని  తొలుత కేంద్రం నిర్ణయం తీసుకొన్నారు.  

 

అయితే కరోనా  కేసులు పెరిగిపోవడంతో  ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర విద్యశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఆదివారం నాడు ప్రకటించారు. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహస్తామనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు.  పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu