కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం

Published : Jan 28, 2019, 02:12 PM IST
కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం

సారాంశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్ లో ఈ రోజు ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన జాగ్వార్ విమానం కుప్పకూలింది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్ లో ఈ రోజు ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన జాగ్వార్ విమానం కుప్పకూలింది. యూపీ రాష్ట్ర రాజధాని లక్నోకి 300కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

గోరఖ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే హెతింపిర్ ప్రాంతం వద్ద పొలాల్లో కుప్పకూలింది. కాగా..ఈ ప్రమాదం నుంచి పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

గతేడాది ఒక జాగ్వార్ విమానం ప్రమాదానికి గురైంది. గతేడాది జూన్ లో గుజరాత్ లోని కచ్ జిల్లాలో జాగ్వార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్ మృతి చెందాడు. 

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం