నేను గొడ్డు మాంసం తింటా.. ఇష్టం ఉంటే మీరూ తినండి... మాజీ సీఎం

By AN TeluguFirst Published Dec 30, 2020, 11:13 AM IST
Highlights

తాను గొడ్డుమాసం తింటానని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ దుమారం రేపుతున్నాయి. ‘అవును.. నేను గొడ్డు మాంసం తింటా. అసెంబ్లీలోనే ఈ విషయం చాలాసార్లు చెప్పా. ఇది నా ఆహారపు అలవాటు. అడగడానికి మీరెవరయ్యా’ అంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఓ కాంగ్రెస్‌ కార్యకర్తపై మండిపడ్డ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. 

తాను గొడ్డుమాసం తింటానని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ దుమారం రేపుతున్నాయి. ‘అవును.. నేను గొడ్డు మాంసం తింటా. అసెంబ్లీలోనే ఈ విషయం చాలాసార్లు చెప్పా. ఇది నా ఆహారపు అలవాటు. అడగడానికి మీరెవరయ్యా’ అంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఓ కాంగ్రెస్‌ కార్యకర్తపై మండిపడ్డ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. 

‘ఇష్టం ఉంటే మీరూ తినండి. లేదా వదిలేయండి. నేనేం బలవంతం చేయను. నా ఆహారం నా హక్కు. అడగడానికి మీరెవరు’ అంటూ సిద్దూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రీ-ట్వీట్‌ చేసింది. ‘కాంగ్రెస్‌ను రాష్ట్రంలో సర్వనాశనం చేసేందుకు మీరొక్కరు చాలు. ధన్యవాదాలు’ అంటూ బీజేపీ ట్యాగ్‌ పెట్టింది.

ఆదివారం హనుమద్‌వ్రతం కావడంతో మాసం తినడం సరైనదేనా అంటూ కాంగ్రెస్‌ కార్యకర్త ప్రశ్నించడంపై సిద్దూ పై విధంగా నిప్పులు చెరిగారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లౌకికధర్మమా? అని సిద్దూను ప్రశ్నించారు. 

‘ఆయన ఏ మాంసం తిన్నా మాకు అనవసరం. హనుమంతుడు ఈ రోజే పుట్టాడా? అంటూ హిందువుల భావాలను దెబ్బతీస్తే మాత్రం సహించేది లేదు’ అంటూ బీజేపీ నేతలు హెచ్చరించారు.
 

click me!