మధ్యప్రదేశ్ లో భార్య జననాంగానికి కుట్లు వేసిన భర్త: ఆమె ఉదారత

Published : Aug 28, 2021, 07:59 AM IST
మధ్యప్రదేశ్ లో భార్య జననాంగానికి కుట్లు వేసిన భర్త: ఆమె ఉదారత

సారాంశం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యపై అుమానంతో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టాడు. భార్య జననాంగానికి కుట్లు వేశాడు.

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య జననాంగానికి కుట్లు వేశాడు. ఆమెపై ఆనుమానంతో అతను ఆ పనిచేశాడు. తనను మోసం చేస్తుందని అతను భావించి ఆ దారుణ సంఘటనకు ఒడిగట్టాడు. 

ఆ సంఘటన సింగ్రౌలీ జిల్లాలోని రైలా గ్రామంలో చోటు చేసుకుంది. తమకు మహిళ సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

అయితే, తన భర్త పట్ల ఆ మహిళ అత్యంత దయాగుణం ప్రదర్శించింది. తన భర్తపై కఠినమైన చర్యలు తీసుకోవడ్దని ఆమె పోలీసులను కోరింది. తన భర్తను పట్టుకుని కేవలం కొట్టాలని, తిరిగి అటువంటి పనిచేయకుండా కొట్టి వదిలేయాలని కోరింది. 

ప్రస్తుతం ఆ మహిళ సింగ్రౌలీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu