మధ్యప్రదేశ్ లో భార్య జననాంగానికి కుట్లు వేసిన భర్త: ఆమె ఉదారత

Published : Aug 28, 2021, 07:59 AM IST
మధ్యప్రదేశ్ లో భార్య జననాంగానికి కుట్లు వేసిన భర్త: ఆమె ఉదారత

సారాంశం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యపై అుమానంతో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టాడు. భార్య జననాంగానికి కుట్లు వేశాడు.

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య జననాంగానికి కుట్లు వేశాడు. ఆమెపై ఆనుమానంతో అతను ఆ పనిచేశాడు. తనను మోసం చేస్తుందని అతను భావించి ఆ దారుణ సంఘటనకు ఒడిగట్టాడు. 

ఆ సంఘటన సింగ్రౌలీ జిల్లాలోని రైలా గ్రామంలో చోటు చేసుకుంది. తమకు మహిళ సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

అయితే, తన భర్త పట్ల ఆ మహిళ అత్యంత దయాగుణం ప్రదర్శించింది. తన భర్తపై కఠినమైన చర్యలు తీసుకోవడ్దని ఆమె పోలీసులను కోరింది. తన భర్తను పట్టుకుని కేవలం కొట్టాలని, తిరిగి అటువంటి పనిచేయకుండా కొట్టి వదిలేయాలని కోరింది. 

ప్రస్తుతం ఆ మహిళ సింగ్రౌలీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో