అనుమానంతో భార్యను చంపి, పట్టుబడకుండా ఉండాలని గుంతతవ్వి పూడ్చి.. సమాధిమీద మొక్కలు పెంచిన భర్త.. చివరికి..

By SumaBala BukkaFirst Published Feb 4, 2023, 7:23 AM IST
Highlights

ఓ భర్త అనుమానంతో కట్టుకున్న భార్యనే కర్కశంగా కడతేర్చాడు. ఆ తరువాత తన పొలంలో గుంతతీసి పూడ్చాడు. వాసన రాకుండా ఉప్పు పోశాడు. అనుమానం రాకుండా సమాధి మీద మొక్కలు పెంచాడు. 

ఉత్తర ప్రదేశ్ : అనుమానం పెనుభూతమై భార్యను బలి తీసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. హత్య చేసిన తర్వాత దొరకకుండా ఉండేందుకు భార్య సమాధిపై మొక్కలు పెంచాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో వెలుగు చూసింది.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..  ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన కూరగాయల వ్యాపారి దినేష్.. అతనికి పెళ్లయింది. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ భార్యతో కలిసి ఘజియాబాద్ లోనే ఉంటున్నాడు. 

అయితే, అతనికి భార్యకు వివాహేతర సంబంధం ఉందేమో అని అనుమానం. దీంతో ఆమెతో నిత్యం గొడవ పడుతుండేవాడు. జనవరి 25వ తేదీ కూడా ఇదే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. అది తీవ్ర వాగ్వాదంగా మారింది. భార్య మీద విపరీతమైన కోపంతో సహనం కోల్పోయాడు దినేష్. భార్య మీద దాడి చేసి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ఒకరోజు మొత్తం భార్య శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా  భార్య శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. 

బాబోయ్.. గురువును చంపి రక్తం తాగాడు.. క్షుద్రశక్తుల కోసం ఓ మంత్రగాడి ఘాతుకం..

దగ్గర్లో ఉన్న వ్యవసాయ భూమిలో భార్య శవాన్ని పాతిపెట్టాడు. అయితే శవం కుళ్ళి మృతదేహం నుంచి వాసన రాకుండా ఉండాలని.. భార్యను పాతిపెట్టిన  సమాధిలో 30 కేజీల ఉప్పును పోశాడు. గుంత ఎందుకు తవ్వావ్ అని చుట్టుపక్కల వారు అడుగుతారని..  తాను పట్టుపడకుండా ఉండాలని.. మొక్కల కోసం గుంత తవ్వినట్టుగా నమ్మించాలనుకున్నాడు. దీనికోసం సమాధి మీద కొన్ని మొక్కలు కూడా నాటాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. 

రెండు రోజుల తర్వాత  స్థానిక పోలీస్ స్టేషన్లో భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్గా విచారణ ప్రారంభించారు. అయితే, ఈ క్రమంలో వారికి దినేష్ కదలికలు అనుమానంగా కనిపించాయి. వెంటనే అతనిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో  దినేష్  భార్య మీద అనుమానంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం దినేష్ కు చెందిన వ్యవసాయ భూమిలో.. అతడు చెప్పిన ప్రాంతంలో తవ్వగా భార్య మృతదేహం దొరికింది.

click me!