ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం హిందీ.. స్థానిక భాషలకు కాదు : అమిత్ షా..

Published : Apr 08, 2022, 07:24 AM ISTUpdated : Apr 08, 2022, 08:21 AM IST
ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం హిందీ.. స్థానిక భాషలకు కాదు : అమిత్ షా..

సారాంశం

కేంద్రహోంమంత్రి అమిత్ షా స్థానిక భాషల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా స్థానికభాషలను కాకుండా హిందీని అంగీకరించాలని కోరారు.

న్యూఢిల్లీ : English కి ప్రత్యామ్నాయంగా Hindiని అంగీకరించాలని.. ఇంగ్లీష్ కు alternativeగా స్థానిక భాషలు కాదని  కేంద్ర హోంమంత్రి Amit Shah గురువారం అన్నారు. ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన షా మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని నిర్వహించే మాధ్యమం అధికార భాష అని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని, ఇది కచ్చితంగా హిందీకి ప్రాముఖ్యతను పెంచుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 

ప్రస్తుతం కేబినెట్‌లోని 70 శాతం ఎజెండా హిందీలో సిద్ధమైందని సభ్యులకు తెలియజేశారు. దేశ ఐక్యతలో అధికార భాష హిందీని ముఖ్యమైన భాగంగా చేయాల్సిన సమయం ఆసన్నమైందని షా అన్నారు. స్థానిక భాషలను కాకుండా ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని ఆయన అన్నారు.

ఇతర స్థానిక భాషల్లోని పదాలను స్వీకరించి హిందీని అనువైనదిగా మారుస్తారే తప్ప ప్రచారం చేయరాదన్నారు. వివిధ భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు ఒకరితో ఒకరు సంభాషించుకున్నప్పుడు అది ‘భారతీయ భాష’లోనే ఉండాలని హోం మంత్రి అన్నారు.

షా మూడు ప్రధాన అంశాలను నొక్కి చెప్పారు.
- ముందుగా, కమిటీ తన నివేదికలోని 1వ నుండి 11వ సంపుటాల వరకు చేసిన సిఫార్సుల అమలు కోసం జూలైలో సమావేశం నిర్వహించవలసిందిగా అభ్యర్థించబడింది.

ఆ సమావేశంలో వాల్యూమ్‌ల వారీగా నివేదిక అమలు గురించి అధికార భాషా కమిటీ కార్యదర్శి సభ్యులకు తెలియజేయాలని షా అన్నారు.

- రెండవ అంశం కింద, 9వ తరగతి వరకు విద్యార్థులకు హిందీ ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు హిందీ బోధన పరీక్షలపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

- మూడో అంశం కింద హిందీ నిఘంటువును సవరించి మళ్లీ ప్రచురించాలని హోంమంత్రి సూచించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిటీ నివేదిక 11వ సంపుటాన్ని రాష్ట్రపతికి పంపడాన్ని షా ఏకగ్రీవంగా ఆమోదించారు.

ప్రస్తుత అధికార భాషా కమిటీ పని చేస్తున్న వేగం ఇంతకు ముందు చాలా అరుదుగా కనిపించిందన్నారు.కమిటీ ఒకే హయాంలో రాష్ట్రపతికి మూడు నివేదికలు పంపడం అందరి ఉమ్మడి విజయమని హోంమంత్రి అన్నారు.సంబంధిత కార్యదర్శులందరితో సమావేశమైన అనంతరం అధికార భాషా కమిటీ నివేదికలోని 1 నుంచి 11వ సంపుటాల సిఫార్సుల అమలు పురోగతిని సమీక్షించేందుకు ఇంప్లిమెంటేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు.

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో 22,000 మంది హిందీ టీచర్లను రిక్రూట్ చేసుకున్నట్లు తెలిపారు. అలాగే, ఈశాన్య ప్రాంతంలోని తొమ్మిది గిరిజన సంఘాలు తమ మాండలికాల లిపిని దేవనాగరిలోకి మార్చుకున్నాయి. ఇది కాకుండా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఎనిమిది రాష్ట్రాలు 10వ తరగతి వరకు పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడానికి అంగీకరించాయని ప్రకటన పేర్కొంది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు అజయ్‌కుమార్‌ మిశ్రా, నిసిత్‌ ప్రమాణిక్‌, అధికార భాషా పార్లమెంటరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ భర్తృహరి మహతాబ్‌, ఇతర కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi : తెలంగాణకు మోదీ వరాలు.. గోల్డ్ కొనొద్దని ప్రధాని ఎందుకు అన్నారు?
CM Thalapathy Vijay Grand Convoy: సీఎం విజయ్ కాన్వాయ్ చూస్తేమతిపోవాల్సిందే | Asianet News Telugu