భారీ వ‌ర్షాల ఎఫెక్ట్ : కార్పొరేట్, ప్రైవేట్ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వైజరీ జారీ

Published : Jul 09, 2023, 08:00 PM IST
భారీ వ‌ర్షాల ఎఫెక్ట్ : కార్పొరేట్, ప్రైవేట్ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వైజరీ జారీ

సారాంశం

Gurugram: దేశంలోని చాలా ప్రాంతాల్లో రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌లు కంపెనీలు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం క‌ల్పిస్తున్నాయి.     

Heavy rains-Work from home advisory issued: దేశంలోని చాలా ప్రాంతాల్లో రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌లు కంపెనీలు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం క‌ల్పిస్తున్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గురుగ్రామ్ యంత్రాంగం జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) అడ్వైజరీ జారీ చేసింది. సోమ‌వారం (10 జూలై) నుంచి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని కార్పొరేట్, ప్రైవేటు కార్యాలయాలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా మార్గనిర్దేశం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లా యంత్రాంగం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, గురుగ్రామ్ సిటీలో ఆదివారం ఉదయం 6.00 నుంచి 11.00 గంటల మధ్య 150 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది, దీని వల్ల ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వే, నగరంలోని వివిధ ప్రాంతాలలో భారీగా వ‌ర్ష‌పు నీరు నిలిచింది. నర్సింగ్ పూర్ చౌరస్తా సమీపంలోని ఎక్స్ ప్రెస్ వేపై ప్రయాణికులు అక్కడికక్కడే భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. నర్సింగ్ పూర్ చౌరస్తా వద్ద మునిగిపోయిన ఎక్స్ ప్రెస్ వే, సర్వీస్ లేన్ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ప్రయాణికులకు ట్రాఫిక్ అంత‌రాల గురించి అప్డేట్ ఇచ్చారు. నీరు నిలవడం, ట్రాఫిక్ పరిస్థితి కారణంగా ఇంటి నుంచే పనిచేయాలని పోలీసులు ప్రయాణికులను కోరారు. అయితే సెలవు కారణంగా జాతీయ రహదారితో పాటు నగరంలోని ఇతర ప్రధాన కూడళ్లలో పెద్దగా ట్రాఫిక్ రద్దీ కనిపించలేదు. సెక్టార్-18 రోడ్డు, నర్సింగ్ పూర్, ఝార్సా క్రాసింగ్, సర్హౌల్, సెక్టార్-30, 31, 38, 40, 44, 45, 47, 29, 50, రాజీవ్ చౌక్, మహావీర్ చౌక్, షీట్లా మాతా రోడ్, సివిల్ లైన్స్, గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ రోడ్, వాటికా చౌక్ సుభాష్ చౌక్, ద్వారకా ఎక్స్ ప్రెస్ వే తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?