భారీ వ‌ర్షాలు: వ‌ర‌ద‌లలో చిక్కుకున్న 3 వేల మంది ప‌ర్యాట‌కులు

Published : Jun 17, 2023, 12:08 PM IST
భారీ వ‌ర్షాలు: వ‌ర‌ద‌లలో చిక్కుకున్న 3 వేల మంది ప‌ర్యాట‌కులు

సారాంశం

Sikkim Landslide: భారీ వర్షాలు, వరదల కారణంగా సిక్కింలో 3,000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. విదేశీ పర్యాటకుల్లో బంగ్లాదేశ్ నుంచి 23 మంది, అమెరికా నుంచి 10 మంది, సింగపూర్ నుంచి ముగ్గురు ఉన్నారు. ఉత్తర సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 345 కార్లు, 11 మోటారు సైకిళ్లు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.  

thousand tourists trapped in Sikkim floods: భారీ వర్షాలు, వరదల కారణంగా సిక్కింలో 3,000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. విదేశీ పర్యాటకుల్లో బంగ్లాదేశ్ నుంచి 23 మంది, అమెరికా నుంచి 10 మంది, సింగపూర్ నుంచి ముగ్గురు ఉన్నారు. ఉత్తర సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 345 కార్లు, 11 మోటారు సైకిళ్లు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. అసోంలో ఒక్క‌సారిగా భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా చాలా మంది పర్యాట‌కులు చిక్కుకుపోయారు. ఉత్తర సిక్కింలో కొండచరియలు విరిగిపడటంతో 2,000 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఉత్తర సిక్కిం జిల్లా కేంద్రం మంగన్ నుంచి చుంగ్ తాంగ్ వెళ్లే రహదారిని పెగాంగ్ సప్లై ఖోలా వద్ద దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీని కార‌ణంగా దాదాపు 3 వేల మంది స్వదేశీ, 40 మందికి పైగా విదేశీ పర్యాటకులు లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. 

విదేశీ పర్యాటకుల్లో బంగ్లాదేశ్ నుంచి 23 మంది, అమెరికా నుంచి 10 మంది, సింగపూర్ నుంచి ముగ్గురు ఉన్నారు. ఉత్తర సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 345 కార్లు, 11 మోటారు సైకిళ్లు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వర్షం ఆగిన తర్వాత రోడ్డు క్లియరెన్స్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించేందుకు సిక్కిం యంత్రాంగం ప‌లు ప్రాంతాల్లో ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమ సిక్కింలోని రింబీలో రింబీ నది నీటిమట్టం పెరగడంతో 90 ఏళ్ల వృద్ధుడు కొట్టుకుపోయాడు. మృతుడిని పశ్చిమ సిక్కింలోని దారాప్ నివాసి యాష్ లాల్ లింబోగా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై ఏఎస్పీ, ఎస్హెచ్వో గీజింగ్ నేతృత్వంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం మృతదేహం ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సింగం-దిక్చు రహదారిపై పర్యాటకులతో వెళ్తున్న కారు చిక్కుకుపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయి పర్యాటకులు చిక్కుకుపోయారు. చివరకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారిని రక్షించింది.

PREV
click me!

Recommended Stories

Suriya & Jyothika to Vote: లైన్లో నిలబడి ఓటు వేసిన హీరో సూర్య, జ్యోతిక | Asianet News Telugu
Vishal Arrives on Bicycle to Vote: సైకిల్ లో వచ్చి ఓటు వేసిన హీరో విశాల్| Asianet News Telugu