మహారాష్ట్ర రైతుల మార్చ్.. రేపు రైతులతో షిండే-ఫడ్నవీస్ భేటీ

Published : Mar 16, 2023, 12:59 AM ISTUpdated : Mar 16, 2023, 01:12 AM IST
 మహారాష్ట్ర రైతుల మార్చ్.. రేపు రైతులతో షిండే-ఫడ్నవీస్ భేటీ

సారాంశం

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) ఆధ్వర్యంలో మహారాష్ట్ర రైతులు నిర్వహించిన పాదయాత్ర థానే జిల్లాలోని కసర పట్టణం మీదుగా సాగిందని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే వినోద్ నికోలాయ్ తెలిపారు. నిరసనకారులు మార్చి 20న ముంబైకి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నుంచి వేలాది మంది రైతులు, గిరిజనులు ముంబై వైపు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర బుధవారం థానే జిల్లాలోకి ప్రవేశించింది. ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ.600 తక్షణ ఆర్థిక సాయం, 12 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్‌లకు మద్దతుగా ఆదివారం దిండోరి పట్టణం నుంచి పాదయాత్రను ఆయన ప్రారంభించారు. సోయాబీన్, పత్తి, కందిపప్పు ధరల పతనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర థానే జిల్లాలోని కసర పట్టణం మీదుగా సాగిందని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే వినోద్ నికోలాయ్ తెలిపారు. నిరసనకారులు మార్చి 20న ముంబైకి చేరుకునే అవకాశం ఉందని నికోలాయ్ తెలిపారు. నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులతో మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం చర్చలు జరుపుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఉల్లి ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులకు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం క్వింటాల్‌కు రూ.300 ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మహారాష్ట్రలో ఉల్లి ధరలు పడిపోయాయి, ఫలితంగా రైతులు తమ ఉత్పత్తులకు చాలా తక్కువ ధరలను పొందుతున్నారు. నాసిక్ జిల్లా దేశంలో ఉల్లి సాగుకు ప్రధాన కేంద్రం.
 
రేపు రైతులతో షిండే-ఫడ్నవీస్ సమావేశం

కాగా, రాష్ట్ర మంత్రులు దాదా భూసే, అతుల్ సేవ్ రైతుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమ 14 అంశాలపై చర్చించామని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే తెలిపారు. పలు అంశాలపై అంగీకారం కుదిరింది. మేము వివరంగా చర్చించాము. చాలా విషయాలపై మా ఆమోదం కూడా ఇచ్చాం. మంత్రాలయంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలవాలని సీపీఐ, రైతులను కోరుతున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రాలయంలో రైతు ప్రతినిధులతో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భేటీ కానున్నారు.

రైతుల డిమాండ్‌ ఏమిటి?

వార్తా సంస్థ పిటిఐ ప్రకారం.. ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ. 600 తక్షణ ఆర్థిక సహాయం, రైతులకు 12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా , వ్యవసాయ రుణమాఫీ వంటి డిమాండ్లతో రైతులు , గిరిజనులు ముంబై నగరంలోని అసెంబ్లీ వైపు పాదయాత్ర చేస్తున్నారు. . ఈ పాదయాత్రను సీపీఐ నిర్వహించింది.

సీపీఐ ఏం చెబుతోంది?

40 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా ఉన్న ఉష్ణోగ్రతలో చాలా మంది చెప్పులు లేకుండా నడుస్తున్నారని, నిరసనకారులు మార్చి 20 న ముంబైకి చేరుకునే అవకాశం ఉందని సీపీఐ ఎమ్మెల్యే వినోద్ నికోల్ చెప్పారు. ముంబైకి వెళ్లే ముందు మోర్చా సభ్యులు గురువారం కలాంబ్ గ్రామంలో బస చేస్తారని థానే జిల్లాలోని షాపూర్ పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu