ఏడేళ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య... ఉరిశిక్షను యావజ్జీవశిక్షగా మార్చిన కోర్టు.. తీర్పులో మరో మెలిక..

By AN TeluguFirst Published Apr 29, 2021, 12:46 PM IST
Highlights

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.  ఈ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పును వెలువరించింది. అయితే, యావజ్జీవ కాలం ముగిసినా, జీవితాంతం అతడు జైల్లో ఉండే రీతిలో మెలిక పెట్టి తీర్పు ఇచ్చింది. 

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.  ఈ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పును వెలువరించింది. అయితే, యావజ్జీవ కాలం ముగిసినా, జీవితాంతం అతడు జైల్లో ఉండే రీతిలో మెలిక పెట్టి తీర్పు ఇచ్చింది. 

తమిళనాడులోని కోయంబత్తూరు లో ఇంటి బయట ఆడుకుంటున్న ఏళ్ల బాలిక అదృశ్యం కావడం రెండేళ్ల క్రితం కలకలం రేపింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఎక్కడ అదృశ్యం అయిందో అక్కడే ఆ బాలిక మృతదేహం గా తేలింది. బాలికపై లైంగికదాడి జరిగినట్టు విచారణలో తేలింది. ఈ కిరాతకానికి ఆ ఇంటి పక్కనే ఉన్న సంతోష్ కుమార్ (34) అనే యువకుడు పాల్పడినట్టు తెలిసింది. అతడిని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. 

కోయంబత్తూరు కోర్టు తొలుత కేసును విచారించి తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష విధించడమే కాకుండా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ధృవీకరణకు హైకోర్టుకు కింది కోర్టు నుంచి పంపించారు. అదే సమయంలో సంతోష్ కుమార్ అప్పీలు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. హైకోర్టు న్యాయమూర్తి న్యాయమూర్తులు పీఎన్‌ ప్రకాష్, శివజ్ఞానం బెంచ్ విచారిస్తూ వచ్చింది. వాదనలు, విచారణలు ముగియడంతో బుధవారం తీర్పు వెలువరించింది.

నిందితుడికి కింది కోర్టు ఇచ్చిన శిక్షణ హైకోర్టు ధృవీకరించింది. ఫోక్సో చట్టంలో అరెస్టులను ఖండిస్తూ నిందితుడికి లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే ఇటీవల కాలంగా కొన్ని కేసు తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలను గుర్తుచేస్తూ నిందితులకు విధించిన ఉరిశిక్షను రద్దు చేశారు. ఈ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు.

యావజ్జీవ శిక్ష కాలం ముగిసినా 25 సంవత్సరాల వరకు విడుదల చేసేందుకు వీలు లేదని తీర్పులో బెంచ్ స్పష్టం చేసింది. అలాగే శిక్ష తగ్గింపునకు సైతం ఆస్కారం లేదని జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని పేర్కొంటూ తీర్పు ఇచ్చారు. కింది కోర్టు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మొత్తాన్ని చెల్లించకుంటే, తక్షణం అందజేయాలని ఆదేశిస్తూ గడువును కోర్టు కేటాయించింది.

click me!