Ramzan: నిజాముద్దీన్ మర్కజ్‌ను తిరిగి తెరవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ !

Published : Apr 01, 2022, 08:13 PM IST
Ramzan: నిజాముద్దీన్ మర్కజ్‌ను తిరిగి తెరవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ !

సారాంశం

Nizamuddin Markaz:  క‌రోనా స‌మ‌యంలో మూత ప‌డిన నిజాముద్దీన్ మర్కజ్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి తెరవడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది. కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. కేవలం ప్రార్థనలు మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. 

Nizamuddin Markaz: COVID-19 మహమ్మారి మధ్య మార్చి 2020 లో తబ్లిఘి జమాత్ సమ్మేళనం జరిగిన నిజాముద్దీన్ మర్కజ్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి తెరవడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది. రంజాన్ మాసంలో భక్తులు ప్రార్థనలు చేయడానికి వీలుగా న్యాయ‌స్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం కోసం మసీదును తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. తబ్లిఘీ కార్యకలాపాలు మరియు ఉపన్యాసాలు జరగవని, ప్రార్థనలు మాత్రమే చేసుకోవ‌డానికి న్యాయ‌స్థానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 

రంజాన్ కోసం, నమాజ్ మరియు మతపరమైన ప్రార్థనలు గ్రౌండ్ ఫ్లోర్‌లో  చేసుకోవ‌డానికి న్యాయ‌స్థానం అనుమ‌తించింది. అలాగే, మస్జిద్ బ్యాంగిల్ వలీలో నాలుగు అంతస్తులలో  కూడా అనుమ‌తులు ఇచ్చింది. ఈ ఏర్పాటు ఈద్‌ ఉల్‌ ఫితర్‌తో ముగిసే రంజాన్‌ నెలకు మాత్రమే అనుమ‌తులు ఉంటాయ‌ని ఢిల్లీ హైకోర్టు ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది. “మతపరమైన ప్రార్థనలు మరియు నమాజ్ (అనుమతించబడింది) కానీ తబ్లిగీ కార్యకలాపాలు అనుమ‌తులు లేవు. మ‌త‌ప‌ర‌మైన కార్య‌క‌ల‌పాలు, ఉపన్యాసాలు, స‌మావేశాల‌కు అనుమ‌తులు ఉండవు కానీ  ప్రార్థనలు చేసుకోవ‌చ్చు అని కోర్టు తెలిపింది. 

షబ్-ఎ-భారత్ సందర్భంగా ప్రాంగణాన్ని తిరిగి తెరవడానికి వివిధ షరతులు విధించిన మార్చి 16 ఆర్డర్‌కు కొనసాగింపుగా తక్షణ అనుమతి ఉందని పేర్కొంది. ప్రాంగణంలోని ప్రతి అంతస్తులోని ప్రవేశం, నిష్క్రమణ మరియు మెట్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. రంజాన్ కాలంలో కెమెరాలు పూర్తిగా పనిచేసేలా చూసుకోవడం మర్కజ్ యాజమాన్యం బాధ్యత అని పేర్కొంది.  షబ్-ఎ-భారత్ సందర్భంగా.. పార్థ‌న‌లు చేసుకోవ‌డానికి ఒక అంతస్తులో 100 మంది వ్యక్తుల పరిమితిని ఎత్తివేసిన‌ప్ప‌టికీ.. అక్క‌డ‌కు వ‌చ్చేవారికి అనుమ‌తించేముందు COVID-19 ప్రోటోకాల్‌లు, సామాజిక దూరాన్ని పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి మసీదు నిర్వాహ‌కులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. 

కాగా, ఢిల్లీ పోలీసులు మరియు కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది రజత్ నాయర్ వాద‌న‌లు వినిపిస్తూ..  నాల్గో అంతస్తులో ప్రార్థనలు చేయడానికి అనుమతి మంజూరును వ్యతిరేకించారు. సైట్ ప్లాన్ నుండి మసీదు కేవలం గ్రౌండ్ ఫ్లోర్‌కు మాత్రమే పరిమితం చేయబడిందని పేర్కొన్నారు. అయితే,  “ఎక్కువ అంతస్తులు ఉంటే, ఎక్కువ స్థలం ఉంది... ఏదైనా కారణం ఉంటే (నాల్గవ అంతస్తు తెరవడాన్ని వ్యతిరేకించడానికి), మాకు చెప్పండి. ఉపరితల వైశాల్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఎక్కువ ప్రాంతం ఎల్లప్పుడూ అనుకూలమైనది”అని కోర్టు వ్యాఖ్యానించింది.

జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టు ప్రకారం.. నాల్గోఅంతస్తు మసీదు ప్రాంతంలో భాగమని, ప్రస్తుత పరిశీలనలు మాత్రమే ప్రధానమని మరియు తీర్పుకు లోబడి ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. మర్కాజ్‌లో (Nizamuddin Markaz) “తబ్లిఘీ కార్యకలాపాలు” మరియు ఉపన్యాసాలు అనుమతించబడవని మరియు ప్రార్థనలు మాత్రమే అనుమతించబడతాయని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కూడా చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ ఘోష్, మార్కాజ్ యాజమాన్యం తరపున సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్, నాల్గవ అంతస్తులో కూడా ప్రార్థనలు చేయడానికి అనుమతించాలని కోర్టును కోరారు.

PREV
click me!

Recommended Stories

Delhi Malviya Nagar Fire Incident: ఢిల్లీలోని మాల్వీయా నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం... | Asianet Telugu
కర్ణాటక సీఎం గా డికె శివకుమార్ ప్రమాణ స్వీకారం | D.K. Shivakumar Takes Oath | Asianet News Telugu