Gyanvapi Masjid Row: జ్ఞానవాపి మసీదు ప్రాంగ‌ణంలో పూజ‌లు..  పిటిషన్ దాఖాలు.. జూలై 21న సుప్రీం విచార‌ణ‌..

Published : Jul 18, 2022, 03:48 PM IST
Gyanvapi Masjid Row: జ్ఞానవాపి మసీదు ప్రాంగ‌ణంలో పూజ‌లు..  పిటిషన్ దాఖాలు.. జూలై 21న సుప్రీం విచార‌ణ‌..

సారాంశం

Gyanvapi Masjid Row: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో దొరికిన శివలింగానికి  పూజించే హక్కు కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ఈ పిటిష‌న్ పై విచార‌ణ‌ను జూలై 21న చేప‌ట్ట‌నున్న‌ట్టు సుప్రీం తెలిపింది.

Gyanvapi Masjid Row: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న‌ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఇటీవ‌ల ల‌భ్య‌మైన‌ శివలింగాన్ని పూజించేందుకు అనుమతి కోరుతూ సుప్రీం కోర్టులో కొత్త పిటిషన్ దాఖాలైంది. ఈ పిటిష‌న్ లో జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఉన్న శివలింగాన్ని సంద‌ర్శించుకుని, పూజించుకునేందుకు హక్కు కల్పించాలని కోరారు. ఈ పిటిష‌న్ స్వీక‌రించిన సుప్రీం .. దీనిని జూలై 21న విచారణ చేపట్టనుంది. న్యాయవాది విష్ణుశంకర్ జైన్ దాఖలు చేసిన ఈ పిటిష‌న్ పై  భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రామన్ నేతృత్వంలోని ధర్మాసనం మాట్లాడుతూ.. ఈ కొత్త పిటిషన్‌తో పాటు దీనికి సంబంధించిన ఇతర పిటిషన్లను జూలై 21న విచారిస్తామని తెలిపింది. 

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కొత్త పిటిషన్‌లో వారణాసి సివిల్ కోర్టు జ్ఞాన్‌వాపి క్యాంపస్‌లో నిర్వ‌హించిన  సర్వేను ఉదహరించింది.  మే 16న కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ సర్వేలో పురాతన శివలింగం కనిపించిందని పిటిషనర్లు తెలిపారు. అలాగే.. శివలింగాన్ని స్వాధీనం చేసుకునే హక్కును కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు ఇవ్వాలని పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు.శివునిపై విశ్వాసం ఉన్నవారికి ఆయనను పూజించే హక్కు ఉంటుందనీ. దానిని ఎవ‌రూ తిరస్కరించలేరని పేర్కొన్నారు. 

అలాగే.. శివలింగం ఏ కాలానికి చెందిందో..కార్బన్ డేటింగ్, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెక్నాలజీని ఉపయోగించి తెలుసుకోవాల‌ని, అలాగే అక్కడ తవ్వకాలు జరపాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కోర్టు ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
 
అదేవిధంగా..  ప్రత్యామ్నాయ ఉపశమనంగా.. ప్లాట్ నెం.9130 (జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్)లో శివలింగం ముందు కెమెరాను ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ కెమెరాను అమర్చడానికి మరియు దాని ఫుటేజీని నిరంతరం ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కోర్టు అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల  భక్తులు శివలింగాన్ని చూడగలుగుతారు మరియు దాని నుండి 83.3 అడుగుల దూరంలో, నంది విగ్రహానికి, శివలింగానికి పూజలు నిర్వ‌హించాలని అన్నారు.


పిటిషనర్ల పేర్లు

అమితా సచ్‌దేవ్, లక్ష్మీ దేవి, సీతా సాహు, మంజు వ్యాస్, రేఖా పాఠక్, ప్రియాంక గోస్వామి, పరుల్ ఖేదా అనే ఏడుగురు మహిళల పేర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాంటి మ‌రో పిటిషన్‌ను రాజేష్ మణి త్రిపాఠి అనే వ్య‌క్తి కూడా దాఖలు చేశారు. ప్ర‌స్తుత పిటిష‌న్ లో పాటు గ‌తంతో దాఖాలు చేసిన పిటిష‌న్ల‌ను జూలై 21 న విచారించ‌నున్న‌ట్టు  సుప్రీం తెలిపింది.

గతంలో సుప్రీంకోర్టు ఆదేశం

మే 20న సుప్రీంకోర్టులో ఈడీ కేసు చివరి విచారణ జరిగింది. జ్ఞాన్వాపి కేసును వారణాసి జిల్లా జడ్జికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, సూర్యకాంత్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ.. కేసు సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకుని మరింత అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి వద్దకు రిఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. 

ముస్లిం పక్షం దరఖాస్తుకు జిల్లా జడ్జి ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో హిందూ తరపు కేసు విచారణకు అనర్హమని సుప్రీంకోర్టు పేర్కొంది. క్యాంపస్‌లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని కోర్టు పేర్కొంది. దీని కింద శివలింగం స్థలం సురక్షితంగా ఉంచబడుతుంది. అంటే వూడూ ఉండదు. ప్రాంగణంలో యథావిధిగా ప్రార్థనలు కొనసాగుతాయి. వూడు కోసం సరైన ఏర్పాట్లు చేయాలని కోర్టు పరిపాలనను కోరింది.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu