Gujarat: జామ్‌నగర్‌లోని హోటల్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. మంట‌ల్లో చిక్కుకపోయిన 27 మంది ! 

Published : Aug 12, 2022, 03:27 AM IST
Gujarat: జామ్‌నగర్‌లోని హోటల్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. మంట‌ల్లో చిక్కుకపోయిన 27 మంది ! 

సారాంశం

Gujarat: గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలోని ఐదు అంతస్తుల హోటల్‌లో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 27 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

Gujarat: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని అలెంటో హోటల్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. హోటల్ భవనంలోని చిక్కుకున్న 27 మందిని రెస్క్యూ సిబ్బంది సుర‌క్షితంగా కాపాడారు. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని జామ్‌నగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రేమ్‌సుఖ్ దేలు తెలిపారు. హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. భవనం చుట్టూ భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యాలు కనిపించాయి. మంట‌ల‌ను ఆర్ప‌డానికి సంఘటన స్థలానికి 5 అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి.

రాత్రి 7:30 గంటల ప్రాంతంలో హోట‌ల్ లో మంటలు చెలారేగాయి. కాసేప‌టికి హోటల్ మొత్తం వ్యాపించాయి. మొత్తం 36 గదులలో 18 గదులలో ఇరవై ఏడు మంది అతిథులు ఉన్నారు. వారందరినీ పోలీసులు రక్షించారు. హోటల్ సిబ్బంది కూడా సురక్షితంగా ఉన్నార‌ని పోలీసులు చెప్పారు. 5 అగ్నిమాపక యంత్రాలు ఘ‌ట‌న స్థలానికి మంట‌ల‌ర్పాయి. రాత్రి 10:30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారి తెలిపారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families