Ahmedabad: గుజరాత్ ఎన్నికల ఏకపక్షంగా ఉన్నాయని హిమ్మత్నగర్లో జరిగిన రోడ్షోలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఇక్కడ ప్రధాని మోడీపై నమ్మకం, ఎనలేని ప్రేమ ఉందన్నారు. సీఎం పటేల్ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి రాష్ట్రంలోని ప్రజలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు.
BJP President JP Nadda: గుజరాత్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని హిమ్మత్ నగర్ లో జరిగిన రోడ్ షో లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గుజరాత్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షమేనని పేర్కొన్న ఆయన మళ్లీ గుజరాత్ లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీపై ఎనలేని ప్రేమ, నమ్మకం ఉన్నందున ఎన్నికలు ఏకపక్షంగా ఉన్నాయనీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పార్టీకి అనుకూలంగా ఉండేలా చూస్తాయని అన్నారు.
Hon. BJP National President Shri Ji during the road show at Himmatnagar, Gujarat. https://t.co/6QO4ndklDa
— Office of JP Nadda (@OfficeofJPNadda)
"రాష్ట్రంలో ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన విధానం తర్వాత గుజరాత్ లోని ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారు" అని నడ్డా చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.
| BJP President JP Nadda holds a roadshow at Himmatnagar in Gujarat, ahead of Assembly polls scheduled to be held in two phases on December 1 and December 5 pic.twitter.com/oP1BuHGJuq
— ANI (@ANI)అంతకుముందు రోజు, రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేస్తామనీ, అలాగే, సంభావ్య బెదిరింపులను అడ్డుకోవడానికి ఉగ్రవాద స్లీపర్ సెల్లను గుర్తించి తొలగించడానికి 'యాంటీ రాడికలైజేషన్ సెల్'ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పార్టీ చేసిన ఇతర వాగ్దానాలలో "20 లక్షల ఉద్యోగావకాశాలు" సృష్టించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తదుపరి ఐదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచడం వంటివి ఉన్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ సమక్షంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్) కింద వార్షిక కవరేజీని ప్రతి ఇంటికి రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచడం, బాలికలకు కేజీ నుండి పీజీ (కిండర్ గార్టెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు) ఉచిత విద్యను అందించడం వంటివి మేనిఫెస్టోలోని ఇతర వాగ్దానాలుగా ఉన్నాయి.
गुजरात विधानसभा चुनाव के लिए भाजपा के संकल्प पत्र का विमोचन किया।
यह बाबा सोमनाथ की पावन धरा गुजरात के सांस्कृतिक गौरव और ऐतिहासिक विकास को नया आयाम देगा।
राष्ट्रवाद की प्रेरणा,अंत्योदय के दर्शन व सुशासन के मंत्र से विकसित गुजरात का स्वप्न साकार करेगा। pic.twitter.com/fCjK4yrLSn