‘దాని గొంతుకోసేస్తా.. తర్వాత నేనూ విషం తాగేస్తా’.. గుజరాత్ ప్రేమోన్మాది కేసులో వెలుగులోకి కొత్త విషయాలు...

Published : Feb 23, 2022, 08:20 AM IST
‘దాని గొంతుకోసేస్తా.. తర్వాత నేనూ విషం తాగేస్తా’.. గుజరాత్ ప్రేమోన్మాది కేసులో వెలుగులోకి కొత్త విషయాలు...

సారాంశం

ప్రేమోన్మాదంతో తనను నిరాకరించిన యువతి గొంతు కోశాడో దుర్మార్గుడు. గుజరాత్ లో సంచలనం సృష్టించిన గ్రీష్మా వెకారియా(21) హత్యోదంతంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అమ్మాయిల తల్లిదండ్రుల్లో భయాన్ని రేకెత్తిస్తోంది.  


గుజరాత్ : ఫిబ్రవరి 12న కామ్రేజ్ పసోదరా ప్రాంతంలోని  గ్రీష్మను ఆమె ఇంటికి వెళ్లి మరీ గొంతు కోసి చంపాడు ఫెనిల్ గోయాని. ఆ సమయంలో తల్లి, ఆమె బంధువులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వాళ్ళపైనా ఫెనిల్ దాడి చేశాడు. ఇక చుట్టుపక్కల కొందరు చూస్తూ... వీడియోలు తీస్తూ ఉండిపోయారే తప్ప, ధైర్యం చేసి గ్రీష్మను కాపాడే యత్నం చేయలేకపోయారు. ఆపై అమ్మాయి గొంతు కోసేసి.. పాన్ నములుతూ.. ఎవరూ దగ్గరికి రాకుండా బెదిరించాడు ఫెనిల్. ఘటన జరిగిన నాలుగు రోజులకు నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. 

భద్రతపై భయాలు..
గ్రీష్మ హత్యోదంతం గుజరాత్ ను వణికించింది. పట్టపగలు.. అదీ అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా చంపడం, వెనుక ఉన్న కొందరు అడ్డుకునేందుకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా ఎవరు సాహసం చేయకపోవడం.. సమాజం తీరును ప్రశ్నించింది. ఇక ఈ కేసులో సూరత్ పోలీసులు 2500 పేజీల ఛార్జీషీటును.. కేసు తీవ్రత దృష్ట్యా తొమ్మిది రోజుల్లోనే రూపొందించి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు సమర్పించారు. ఇందుకోసం మొత్తం 190 మంది సాక్షులను, 25 మంది ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించారు పోలీసులు.

దొంగతనం ఏకే-47 కోసం..
ఇదిలా ఉండగా… నిందితుడు ఫెనిల్ ఈ-కామర్స్ పోర్టల్ ల్లో హత్యకు ఉపయోగించిన కత్తిని కొనుగోలు చేశాడు. అంతకుముందు ఇంటర్నెట్లో ఏకే-47 కొనుగోలుకు సంబంధించి సెర్చ్ చేసినట్లు హిస్టరీ ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఫెనిల్ గోయాని పక్కా చిచోరా గ్యాంగ్. తాగి గ్యాంగ్ వార్లలో జోక్యం చేసుకునేవాడు. గతంలో ఒక కారు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు కూడా. గ్రీష్మ తో కలిసి చదువుకున్న ప్పటికీ.. తర్వాత అటెండెన్స్ లేక డీబార్ అయ్యాడు.   గ్రీష్మ ను తరచూ ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధించేవాడు. చివరికి విషయం గ్రీష్మ ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వారు ఫిర్యాదు దాకా వెళ్లారు.  

తమ కొడుకు మళ్లీ గ్రీష్మ జోలికి రాడని ఫెనిల్ పేరెంట్స్ మాట ఇవ్వడంతో గ్రీష్మ ఇంట్లో వాళ్ళు వెనక్కి తగ్గారు. ఆపై మళ్ళీ ఆమె కాలేజీకి వెళ్లి వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె సీరియస్ వార్నింగ్ ఇవ్వగా, ఆమె బంధువులు సైతం బెదిరించారు. ఆ కోపంతోనే గ్రీష్మం బలి తీసుకున్నాడు.

విషం తాగేస్తా అంటూ…
ఇక గ్రీష్మను హత్య చేశాక..  నిందితుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కథనాలు వచ్చాయి. కానీ అది నిజం కాదని పోలీసులు స్పష్టం చేశారు. గ్రీష్మ ప్రాణం పోయేదాకా ఎవరినీ దగ్గరికి రాకుండా కత్తితో బెదిరించాడని పోలీసుల తెలిపారు. ఆపై గాయపర్చుకుని డ్రామాలాడాడని తెలిపారు. అయితే ఘాతుకానికి ముందు స్నేహితులతో మాట్లాడిన ఆడియో క్లిప్ ను మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అవతలి వారితో గ్రీష్మను గొంతు కోసి చంపేయాలనుకుంటున్నా అని, ఆపై తాను విషం తాగి అక్కడే చనిపోతానని చెప్పినట్లు ఉందట. 

అయితే హత్యకు ముందు నలుగురు స్నేహితులతో కలిసి చర్చించిన ఫెనిల్.. తాను చావకూడదని ఫిక్స్ అయ్యాడు. ఘటన తర్వాత తనతో వచ్చిన ఆ నలుగురు  తలోదిక్కు పారిపోయారు. కాగా, ‘మహిళల భద్రతకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం ఎలా చెప్పుకుంటోంది. నా కూతురు అమాయకురాలు. ఆమె ఏ తప్పు చేయలేదు. అయినా హత్య చేశారు. నాకు న్యాయం కావాలి. నా కళ్లెదుటే నా కూతురు గొంతుకోశాడు. రక్తం ధారలుగా పారింది. ఇదంతా నా కళ్ల ముందే జరిగింది. దేశంలోని ఆడపిల్లలకు గ్రీష్మ గతి పట్టకూడదు. అమ్మాయిలకు రక్షణ ఏది? రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతను కల్పిస్తేనే రాష్ట్రంలోని అమ్మాయిలు భద్రంగా ఉంటారు..’  అని గ్రీష్మ తల్లి విలాస్ వెకారియా ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌