
BA.4 And BA.5 Variants Of COVID: ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి పీడ పోయిందనీ, సాధారణ జీవితాన్ని తిరిగి గడపవచ్చుననీ భారత్ ఊపిరి తీసుకుంటున్న వేళ మళ్లీ భయంకరమైన భారీ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు థర్డ్ ఎదుర్కొన్న భారత్ తాజాగా ఒమిక్రాన్ యొక్క BA.4, BA.5 ఉప-వేరియంట్స్ తొలి కేసులు భారత్ లో బయట పడినట్టు ప్రభుత్వం ఆదివారం ధృవీకరించింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ INSACOG ఓమిక్రాన్ సబ్వేరియంట్ BA.4 తొలి కేసు తమిళనాడులో నివేదించింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 సోకినట్లుగా తొలి కేసును గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఎన్ఎస్ఏసీవోజీ ధ్రువీకరించింది. అలాగే తెలంగాణకు చెందిన 80 ఏండ్ల కరోనా పాజిటివ్ మహిళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.5ను తొలి కేసుగా గుర్తించినట్లు తెలిపింది.
ఈ ఇద్దరు రోగుల్లో స్వల్పంగా కరోనా లక్షణాలున్నాయని, వారు పూర్తిగా టీకాలు తీసుకున్నారని, విదేశాల్లో ప్రయాణించలేదని వివరించింది. అయితే ముందు జాగ్రత్తగా ఈ కొత్త వేరియంట్ల కరోనా సోకిన రోగులను కలిసిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఇద్దరు రోగుల కాంట్రాక్ట్ ట్రేసింగ్ను నిర్వహిస్తున్నట్లు ప్యానెల్ తెలిపింది.
మరోవైపు ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 వేరియంట్ల కరోనా వైరస్ను తొలిసారి దక్షిణ ఆఫ్రికాలో గుర్తించారు. అనంతరం ఈ సబ్ వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న దక్షిణ ఆఫ్రికా ప్రయాణికుడిలో BA.4 వేరియంట్ లక్షణాలు ఉన్నట్టు INSACOG తన ప్రకటనలో తెలిపింది. అయితే ఈ వేరియంట్ కరోనా వల్ల ముప్పు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగడం వంటివి పెద్దగా లేవని ఆ కేంద్ర సంస్థ తెలిపింది.
తెలంగాణలో 80 ఏళ్ల వృద్ధుడు SARS-CoV-2 యొక్క BA.5 వేరియంట్కు పాజిటివ్ పరీక్షించాడు. తెలంగాణ రోగి తేలికపాటి లక్షణాలను మాత్రమే కనిపించినట్టు వెల్లడించారు. BA.5 వేరియంట్తో సంక్రమించిన రోగికి పూర్తిగా వ్యాక్సిన్ ఇవ్వబడింది, ప్రయాణ చరిత్ర లేదు ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఇద్దరు రోగుల కాంట్రాక్ట్ ట్రేసింగ్ జరుగుతోంది.
BA.4 , BA.5 వేరియంట్లు ఏమిటి,
యూరప్లోని సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ BA.4, BA.5 సబ్-వేరియంట్ BA.4 And BA.5 Variants Of COVIDలను గుర్తించింది. ఈ రెండు వేరియంట్లు నిజానికి ఓమిక్రాన్ వేరియంట్లో అభివృద్ధి చెందినవనీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ రెండు సబ్ వేరియంట్లకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది.
BA.4 And BA.5 Variants Of COVID ఉప-వేరియంట్లు ఈ సంవత్సరం జనవరిలో దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించారు. అప్పుడు భారతదేశం కరోనా యొక్క థర్డ్ వేవ్ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ఉప-వేరియంట్ యొక్క మొదటి కేసులు భారతదేశంలో కనుగొనబడ్డాయి, ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, యూరప్, అమెరికాలో వేగంగా వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో 55 శాతం కరోనా కేసుల్లో ఈ వేరియంట్ కేసులు కావడం గమనార్హం.