రైతులకు సహాయం చేయడానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఫిక్కీ సదస్సులో మోడీ

Bukka Sumabala   | Asianet News
Published : Dec 12, 2020, 02:01 PM IST
రైతులకు సహాయం చేయడానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఫిక్కీ సదస్సులో మోడీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం FICCI 93వ వార్షిక సదస్సులో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేసిన పోరాటాన్ని ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన పిఎం, దేశంలో కోవిడ్ -19 పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతోందని, ప్రజారోగ్యామే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం FICCI 93వ వార్షిక సదస్సులో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేసిన పోరాటాన్ని ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన పిఎం, దేశంలో కోవిడ్ -19 పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతోందని, ప్రజారోగ్యామే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని అన్నారు.

ఫిబ్రవరి-మార్చిలో COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పుడు, మనం తెలియని శత్రువుపై పోరాడుతున్నాం. దీనివల్ల చాలా అనిశ్చితులు ఏర్పడ్డాయి. ఇది ఉత్పత్తి, లాజిస్టిక్స్, ఆర్థిక వ్యవస్థ  పునరుజ్జీవనం లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకెంత కాలం కొనసాగుతుంది? ఈ పరిస్థితులు ఎలా మెరుగుపడతాయి?అనే ప్రశ్నలున్నాయి '' అని ప్రధాని అన్నారు.

"20-20 మ్యాచ్ లో చాలా అంశాలు వేగంగా మారతాయి. కానీ 2020 మాత్రం  ప్రతీ ఒక్కరినీ కలవరపరిచింది. దేశం, ప్రపంచం చాలా ఒడిదుడుకులు చూశాయి. కొన్ని సంవత్సరాల తరువాత కరోనా పీరియడ్ గురించి ఆలోచిస్తే ఈ పరిస్తితిని నమ్మలేకపోతాం. ఈ పరిస్థితుల్లో వేగంగా వస్తున్న మార్పులు మంచిదే.'' ఇంకా ప్రధాని మాట్లాడుతూ  2020 లో భారతదేశం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, పరిస్థితులు వేగంగా మెరుగుపడ్డాయని, కోలుకోవడానికి రోడ్ మ్యాప్ ఉందని అన్నారు.

డిసెంబర్ నాటికి కోవిడ్ పరిస్థితి మారిందని ప్రధాని నొక్కి చెప్పారు. "మాకు సమాధానాలు, రోడ్‌మ్యాప్ ఉన్నాయి. ఈ రోజు ఆర్థిక సూచికలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. సంక్షోభ సమయంలో దేశం నేర్చుకున్న విషయాలు భవిష్యత్ తీర్మానాలను మరింత బలోపేతం చేశాయి" అని  FICCI 93 వ వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు.

మహమ్మారి సమయంలో భారత్ రికార్డు స్థాయిలో ఎఫ్‌డిఐ, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను చూసింది. గత 6 సంవత్సరాల్లో ప్రపంచం భారతదేశంపై ఉంచిన విశ్వాసం గత కొన్ని నెలల్లో మరింత బలపడిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది ఎఫ్‌డిఐ లేదా ఎఫ్‌పిఐ అయినా - విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టారని, దీన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.

"గత రంగాల విధానాలు అనేక రంగాలలో అసమర్థతను ప్రోత్సహించాయని, కొత్త ప్రయోగాలను నిలిపివేసాయి'' అన్నారు.  కానీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ '' ప్రతి రంగంలో సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశానికి దీర్ఘకాలిక పోటీ ప్రయోజనం ఉన్న రంగాలలో సాంకేతిక ఆధారిత పరిశ్రమలను తిరిగి శక్తివంతం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. '' అని ప్రధాని అన్నారు.

ఊహించిన దానికంటే వేగంగా రికవరీ ఉందని, ఆర్థిక రంగంలో ఆర్థిక సూచికలు ప్రోత్సహిస్తున్నాయని ప్రధాని చెప్పారు. COVID-19 మహమ్మారి సమయంలో భారత్ ప్రాణాలను కాపాడటానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రభుత్వ విధానాలు, చర్యలు ఆ దిశగానే సాగాయని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా రైతుల నిరసన గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ, రైతుల సంఘర్షణకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. ఇటీవలి వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త మార్కెట్లను ఏర్పాటు చేస్తుందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుందని, వ్యవసాయ రంగానికి పెట్టుబడులు పెట్టడానికి సహాయపడతాయని ఇది వ్యవసాయ సమాజానికి మేలు చేసేవని తెలిపారు. 

"వ్యవసాయ రంగందానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాల మధ్య అడ్డంకులు చూశాం.  అది వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆహార ప్రాసెసింగ్, నిల్వ, కోల్డ్ చైన్. ఇప్పుడు ఈ అడ్డంకులు తొలగుతాయి. సంస్కరణల తరువాత వ్యవసాయ రంగంలో ఎక్కువ పెట్టుబడులు వస్తాయి. రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

నిజానికి FICCI  వార్షిక సమావేశం డిసెంబర్ 11, 12, 14 తేదీలలో జరుగుతోంది. ఈ సంవత్సరం వార్షిక సదస్సు థీమ్ “ఇన్స్పైర్డ్ ఇండియా”. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, బ్యూరోక్రాట్లు, పరిశ్రమల కెప్టెన్లు, దౌత్యవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu