అధికారి అసభ్యంగా ప్రవర్తిస్తే.. నాలుగు పీకింది.. వీడియో వైరల్...

Published : Jul 22, 2021, 10:37 AM IST
అధికారి అసభ్యంగా ప్రవర్తిస్తే.. నాలుగు పీకింది.. వీడియో వైరల్...

సారాంశం

దీనికి అతను అసభ్యంగా మాట్లాడాడు. దీంతో మహిళ కోపం పట్టలేక చేతితో నాలుగు దెబ్బలు బాదడంతో అధికారి కంగుతిన్నాడు. అక్కడే ఉండే ఎవరో ఈ దృశ్యాలను మొబైల్ లో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కర్ణాటక మైసూరులో దారుణం జరిగింది. నివాస ద్రువీకరణ పత్రం కోసం పాలికె కార్యాలయానికి వెళ్లిన మహిళతో అధికారి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. శారదాదేవీ నగరలో పాలికె జోన్ కార్యాలయంలో విషకంఠేగౌడ అనే అధికారిని నివాస ధ్రువీకరణ పత్రం కోసం ఓ మహిళ అడిగింది. 

దీనికి అతను అసభ్యంగా మాట్లాడాడు. దీంతో మహిళ కోపం పట్టలేక చేతితో నాలుగు దెబ్బలు బాదడంతో అధికారి కంగుతిన్నాడు. అక్కడే ఉండే ఎవరో ఈ దృశ్యాలను మొబైల్ లో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటన మీద సరస్వతిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. 

కాగా, బసశంకరి అనేకల్ తాలూకాలోని వినాయకగరలో నివాసం ఉంటున్న నాగవేణి (45) అనే మహిళ బుధవారం హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతుకు కేబుల్ వైర్ బిగించి హత్య చేశారు. అనేకల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నినిమత్తం ఆనేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తెలిసినవారే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   
 

PREV
click me!

Recommended Stories

BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం