గ్లోబల్ సౌత్ సమ్మిత్ : గాజా యుద్ధంలో పౌరుల మరణాలు దారుణం.. ప్రధాని మోడీ

Published : Nov 17, 2023, 12:27 PM IST
గ్లోబల్ సౌత్ సమ్మిత్ : గాజా యుద్ధంలో పౌరుల మరణాలు దారుణం.. ప్రధాని మోడీ

సారాంశం

సంప్రదింపులు, కమ్యూనికేషన్, సహకారం, సృజనాత్మకత, సామర్థ్యం పెంపుదల లాంటి 'ఐదు C' సూత్రాలతో సహకార వ్యూహం మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు.

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరుల మరణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు గ్లోబల్ సౌత్ మధ్య ఐక్యత, సహకారాల అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పారు. 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ -ఈ ప్రారంభ సెషన్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, హింస, ఉగ్రవాదాలు, ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7 దాడులతో సహా ఇలాంటి చర్యలకు భారత్  వ్యతిరేకమని చెప్పారు. 

సంయమనం పాటించడం, చర్చలకు ప్రాధాన్యత ఇవ్వడం సంక్లిష్టమైన ఇరు దేశాల వివాద పరిష్కారానికి మూలస్తంభాలని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. "పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న సంఘటనల నుండి కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయని మనమందరం చూస్తూనే ఉన్నాం. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రదాడిని భారతదేశం ఖండించింది" అని ప్రధాని మోదీ అన్నారు. "మేము అలాగే సంయమనం పాటించాం. సంభాషణలు, దౌత్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన ఘర్షణలో పౌరుల మరణాలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం" అన్నారు.

తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఈసారి ప్రత్యేక ఆకర్షణలివే..

"పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడిన తర్వాత, పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని కూడా పంపాం. గ్లోబల్ సౌత్‌లోని దేశాలు ప్రపంచ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం ఇది" అన్నారాయన. గ్లోబల్ సౌత్ అనేది ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని దక్షిణ అర్ధగోళంలో వివిధ స్థాయిల ఆర్థిక అభివృద్ధితో ఉన్న దేశాల సమాహారం. ఈ దేశాలు తరచుగా పేదరికం, అసమానత, వనరులకు పరిమిత ప్రాప్యత వంటి సాధారణ సవాళ్లను ఎదుర్కొంటాయి.

అక్టోబర్ 7న పాలస్తీనా గ్రూప్ హమాస్.. ఇజ్రాయేలీలపై భూ-సముద్ర-వాయు దాడిని ప్రారంభించింది. దీంతో 1,200 మందికి పైగా ఇజ్రాయెల్‌లు మరణించారు. దీనికి ప్రతీకారంగా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో హమాస్ కోట అయిన గాజా స్ట్రిప్‌ను నాశనం చేశాయి. దీంతో 11,000 మందికి పైగా మరణించారు. 

సంప్రదింపులు, కమ్యూనికేషన్, సహకారం, సృజనాత్మకత, సామర్థ్యం పెంపుదల లాంటి 'ఐదు C' సూత్రాలతో ద్వారా సహకార వ్యూహం మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. భారత్ చేసిన ప్రయత్నాలతో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యదేశంగా జి20లో చేరిన ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని మరచిపోలేనని ప్రధాని మోదీ అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu