చెల్లి ప్రియుడి పురుషాంగాన్ని కత్తెరతో కట్‌చేసి...

By Arun Kumar PFirst Published Sep 20, 2018, 3:20 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. తమ చెల్లితో ప్రేమాయణం సాగిస్తున్న ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు అమానుషంగా వ్యవహరించారు. యువకుడి పురుషాంగాన్ని కత్తెరతో కట్ చేసి తీవ్రంగా గాయపర్చారు. ప్రస్తుతం బాధిత యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 

ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. తమ చెల్లితో ప్రేమాయణం సాగిస్తున్న ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు అమానుషంగా వ్యవహరించారు. యువకుడి పురుషాంగాన్ని కత్తెరతో కట్ చేసి తీవ్రంగా గాయపర్చారు. ప్రస్తుతం బాధిత యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యూపీ గోరఖ్ పూర్ సమీపంలోని ఖజిని గ్రామానికి చెందిన నిషాద్ అనే వ్యక్తి కూతురు వేరే గ్రామానికి చెందిన దీప్ చంద్ గుప్తా గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం తెలిసిన నిషాద్ కూతురితో పాటు గుప్తాను కూడా పలుమార్లు వార్నింగ్ ఇచ్చాడు. కూతురు బయటకు వెళ్లకుండా గృహనిర్భందం విధించాడు.

అయితే తండ్రి కల్లుగప్పి ఇంట్లోంచి రాత్రి సమయంలో బయటకు వచ్చిన యువతి ప్రియుడు గుప్తాకు ఫోన్ చేసింది. దీంతో అతడు యువతి గ్రామానికి వచ్చాడు. అయితే వీరిద్దరు ఇలా కలిసి ఉండటాన్ని నిషాద్ గమనించాడు. తమ ఇద్దరు కుమారులు సందీప్, ప్రదీప్ లను వీరిపై ఉసిగొల్పాడు. 

దీంతో వీరు ప్రేమ జంటపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా గుప్తా పురుషాంగాన్ని పదునైన కత్తెరతో కట్ చేశారు. అపస్మరక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితున్ని అక్కడే వదిలేసి తమ చెల్లిని తీసుకుని వెళ్లిపోయారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన గుప్తాను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం అవడంతో పాటు సున్నితమైన పురుషాంగపై గాయం కావడంతో ప్రస్తుతం దీప్ చంద్ గుప్తా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణానికి పాల్పడిని నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

click me!