బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కనిపించిందని...

Published : Mar 15, 2021, 07:59 AM IST
బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కనిపించిందని...

సారాంశం

ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. అబ్బాయితో మాట్లాడతావా అంటూ గ్రామస్థులే ఆమెపై దాడి చేయడం గమనార్హం. 


ఈ కాలంలో బాయ్ ఫ్రెండ్స్ లేని అమ్మాయిలు చాలా అరుదు అనే చెప్పాలి. బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడటం.. షికార్లు చేయడం కూడా సర్వ సాధారణమైపోయింది. ఇలాంటి రోజుల్లో.. కేవలం బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కనిపించిందనే కారణంతో ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. అబ్బాయితో మాట్లాడతావా అంటూ గ్రామస్థులే ఆమెపై దాడి చేయడం గమనార్హం. ఈ సంఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భరత్ నగర్ కి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఒక షాపు ముందు కూర్చొని ముచ్చట్లు చెప్తోంది. దీన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఆమెను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను పోలీసులు పరిశీలించారని తెలుస్తోంది.  ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. మాట్లాడినందుదకే ఇంత దారుణంగా కొట్టడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

నామినేషన్‌కు విజయ్ తలపతి పవన్‌ కళ్యాణ్‌ను మించిన ఫాలోయింగ్: Thalapathy Vijay rally | Asianet Telugu
TVK Chief Vijay Files Nomination: విజయ్ నామినేషన్ చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్| Asianet News Telugu