
ఫ్రమ్ ది ఇండియా గేట్.. అధికారం ఉన్నచోట తెరవెనుక చాలా జరుగుతాయి. అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు.. ఇలా చాలా ఉంటాయి. ఏషియానెట్ న్యూస్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా రాజకీయాలు, బ్యూరోక్రసీ పల్స్లోకి ప్రవేశించింది. ఫ్రమ్ ది ఇండియా గేట్ మొదటి ఎపిసోడ్ ద్వారా రెండు చానళ్లు, రెండు ఫొటోలు, కూర్చీల మార్పిడి.. వంటి అంశాలతో కూడుకున్న కథనాలను అందజేస్తోంది..
బ్రేకింగ్ న్యూస్..
రాజ్యసభ, లోక్సభ టీవీ ఛానెల్స్ను సంసద్ టీవీగా విలీనం చేసినప్పటి నుంచి.. రెండింటి మధ్య టగ్ ఆఫ్ వార్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు లోక్సభదే స్వల ఆధిక్యల ఉండగా.. కొన్ని ప్రొటోకాల్స్ లోక్సభ, రాజ్యసభ అధికారులకు చాలా కష్టమైన సమస్యగా మారుతున్నాయి. కొత్త ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. ప్రాధాన్యతా క్రమంలో చూసినా ఉపరాష్ట్రపతి రెండో స్థానంలోనూ, స్పీకర్ ఆరో స్థానంలోనూ ఉన్నారు. సహజంగానే ఉభయ సభలలో కార్యకలాపాలను బట్టి స్క్రీన్ సమయం కూడా అందుకు తగ్గట్టుగా ఉంటుంది.
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. లోక్సభ, రాజ్యసభ కార్యాలయాల్లో కూడా సంసద్ టీవీలో ఏం చూపించారు, ఎవరికి ఎంత సేపు కేటాయించారే అనే రికార్డులు వేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇక, ప్రోటోకాల్లు, అధికారాల మధ్య చిక్కుకోవడం రాజస్థాన్లోని ఎడారి ఇసుకలో నడవడం కంటే చాలా కష్టం అని ఒక విశ్వసనీయ వర్గం పేర్కొంది. ఏమైనా వీక్షకులకు విరామం అవసరమనిపిస్తోంది!
షూట్ ఎట్ సైట్..
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆర్మీ హౌస్లో విజయ్ దివస్ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు యూనిఫాంలో మెడల్స్తో వచ్చి జనంతో ముచ్చటించారు. ఈ వేడుకకు వచ్చిన పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ మొదటి నుంచి తన బాడీ లాంగ్వేజ్ని ప్రదర్శించారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన మొదట విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి వెనుక కూర్చున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోపలికి వెళ్లే ముందు.. మొదటి వరుసలో ఎడమ మూలకు వెళ్లారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గౌరవ అతిథులను పలకరించగా.. జనరల్ వీకే సింగ్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో సంభాషణలో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రవేశించే ముందు స్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ప్రధానితో సంభాషిస్తున్నట్లు కనిపించింది. ఇక, ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతించబడనప్పటికీ.. కొంతమంది దౌత్యవేత్తల మాత్రం ఫోన్లను తీసుకెళ్లారు. వారు ఉత్సాహంగా ప్రధానితో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.
పదాలతోనే వివరించాల్సిన అవసరం లేదు..
కొన్ని ఫొటోలు వివరించేందుకు పదాలు అవసరం లేదు.. ఎందుకంటే ఆ ఫొటోలే చాలా ఎక్కువ ఆలోచనలను అందజేస్తాయి. ఇటీవల రెండు ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ చిత్రాలలో రాజకీయ నాయకులు ఉండటంతో.. అవి మరింత ఆసక్తికరంగా మారాయి. లెఫ్ట్-రైట్-లెఫ్ట్: ఒక ఫొటోలో ప్రధాని మోదీతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజాలు నవ్వుతూ కనిపించారు. అయితే ఈ ఫొటో సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా కేరళ ప్రజలకు.. ఎందుకంటే మోదీకి అతి పెద్ద విమర్శకులలో ఒకరైన సీతారాం ఏచూరి నవ్వుతూ మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని జర్నలిస్టులు ఆసక్తిగా ఉన్నారు.
అయితే ఈ విషయంపై జర్నలిస్టులు ఎవరూ మోదీని అడగలేరు. దీంతో జర్నలిస్టులు ఈ విషయమై వామపక్ష నేతలను నిత్యం అడగటం మొదులపెట్టారు. అయితే మేము వారి నుంచి సేకరించిన సమాచారం ఏమిటంటే.. మోదీ చేసిన కామెంట్ అక్కడ నవ్వులు పూసేలా చేసింది. ‘‘నేను మిమ్మల్ని చాలా తరచుగా చూడను..మీరు బహుశా నా నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు, కాదా?’’ ఇది విన్నప్పుడు ఇద్దరు నేతలు కూడా పెద్దగా నవ్వారు.
రెండో చిత్రం మాజీ ప్రధాని మోదీని హెచ్డీ దేవెగౌడ కలిసేందుకు వస్తున్న దృశ్యం. వీల్ చైర్లో ఉన్న దేవెగౌడతో ప్రధాని చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫొటో.. తీవ్రమైన చర్చకు దారితీసింది. అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో రెండు ప్రాంతీయ సమస్యలపై తాను ప్రధానితో చర్చించానని చెప్పారు. అయితే మోదీ- దేవెగౌడ సమావేశాన్ని చూసిన మరో నేతకు కొన్ని పాత రోజులు గుర్తుకువచ్చాయి.. అయితే 1996లో దేవెగౌడను భారత 11వ ప్రధానిగా ఎన్నుకున్న సమావేశంలో ఆ నేత కూడా ఉన్నారు.
1996లో యునైటెడ్ ఫ్రంట్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి కావడానికి వీపీ సింగ్ పేరు మొదట ప్రస్తావించబడింది. వెళ్లిపోయిన వీపీ సింగ్ జ్యోతిబసును నామినేట్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ రెండుసార్లు తిరస్కరించింది. తమిళనాడు భవన్లో జరిగిన చివరి సమావేశంలో జ్యోతిబసు చుట్టూ కూర్చున్న నేతల చూశారు. ఆ సమయంలో రెండు పేర్లు ఆమె మనసులో తట్టాయి. అందులో ఒకరు జీకే మూపనార్ కాగా, మరొకరు దేవెగౌడ. అయితే మూపనార్ పేరును సూచించడానికి సంబంధించి చిదరంబరంతో తన వెనకాల ఉన్న యువ నాయకుడి ద్వారా సంప్రదింపులు జరిపారు. చిదంబరం తన చేతులతో వద్దు అని సంకేతం ఇచ్చారు.
దీంతో దేవెగౌడ పేరును జ్యోతిబసు సూచించారు. దేవెగౌడ కోరుకుంటున్నట్లు జ్యోతిబసుకు చెప్పారు. ‘‘మహారథులు ఉన్న ఇక్కడ నా పేరు ఎలా చెప్పారో అర్థం కావడం లేదు. కానీ అది నా నాయకుడే నిర్ణయించాలా” అని దేవెగౌడ అన్నారు. అయితే ఆ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఒడిలో కాలు పెట్టుకుని కూర్చున్న లాలూ అయిష్టంగానే.. ‘‘మంచిది.. అలాగే కానివ్వండి’’ అని అన్నారు. ఆ విధంగా భారత 11వ ప్రధానమంత్రిని నిర్ణయించారు.
శీర్షిక.. కొన్ని ఫోటోగ్రాఫ్లు కేవలం భవిష్యత్తు కోసం వర్తమానాన్ని క్యాప్చర్ చేయడమే కాకుండా గతానికి సంబంధించిన జ్ఞాపకాలను కూడా గుర్తుకు తెస్తోంది.
కేరళలో క్రిస్మస్ వేడుకలకు అధికార పక్షం దూరం..
కేరళ ప్రభుత్వం నిర్వహంచే ఓనం వేడుకలకు సాధారణంగా గవర్నర్, ఆయన సతీమణి ముఖ్య అతిథులుగా వస్తుంటారు. అయితే ఈ ఏడాది రాజధానిలో వేడుక జరిగినప్పుడు గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్, ఆయన సతీమణిని ప్రభుత్వం ఆహ్వానించకపోవడంతో ఆ రోజు గవర్నర్ గైర్హాజరయ్యారు. కేరళలో పినరాయి విజయన్ సర్కార్, రాజ్భవన్ల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధమే ఇందుకు కారణం. ఆ తర్వాత మూడు నెలల తర్వాత క్రిస్మస్ పండుగకు 11 రోజుల ముందు డిసెంబర్ 14న గవర్నర్ నివాసం రాజ్ భవన్ లో క్రిస్మస్ పార్టీ జరిగింది.
యూనివర్శిటీ ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ను తప్పించే వివాదాస్పద బిల్లును కేరళ అసెంబ్లీ ఆమోదించిన మరుసటి రోజు ఈ పార్టీ జరిగింది. ఇందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేత, స్పీకర్లను గవర్నర్ ఆహ్వానించారు. అయితే వారెవరూ విందుకు హాజరుకాలేదు. గవర్నర్- రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కొనసాగింపు అయినప్పటికీ.. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీతో పాటు ఇతర శాఖల కార్యదర్శులు, మత పెద్దలు ఈ విందుకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి విజయన్ ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశంలో విందులకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. విందు బహిష్కరణకు సంబంధించిన సమాచారం ముందురోజే వార్తల్లోకి వచ్చింది.