ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి కన్నుమూత

Published : Mar 26, 2021, 11:24 AM IST
ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి కన్నుమూత

సారాంశం

రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి (68) కన్నుమూశారు. ముంబైలో తన నివాసంలో గుండెపోటుతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 15జూన్ 2009 - 25 ఏప్రిల్ 2014  మధ్య కాలంలో కేసీ చక్రవర్తి ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు.

రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి (68) కన్నుమూశారు. ముంబైలో తన నివాసంలో గుండెపోటుతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 15జూన్ 2009 - 25 ఏప్రిల్ 2014  మధ్య కాలంలో కేసీ చక్రవర్తి ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు.

అయితే పదవీకాలం ముగిసేలోపు వ్యక్తిగత కారణాల రీత్యా మూడు నెలల ముందే రాజీనామా చేశారు. చక్రవర్తికి భార్య కొడుకు ఉన్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ, పరిశోధకుడిగా పనిచేశారు. 

ఆర్ బీఐలో చేరడానికి ముందు, చక్రవర్తి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా రెండేళ్లు ఉన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) ఛైర్మన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. 

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు