ఇండియాలో కరోనా కలకలం: ఒక్క రోజులోనే 59వేల కేసులు

Published : Mar 26, 2021, 10:39 AM IST
ఇండియాలో కరోనా కలకలం:  ఒక్క రోజులోనే 59వేల కేసులు

సారాంశం

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దేశంలో శుక్రవారం నాడు 59, 118  కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,18, 46,652 కి చేరుకొంది.

దేశంలో గత రెండు వారాలుగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మాస్కులు దరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి వాటి కారణంగా  కరోనా కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.గత ఏడాది అక్టోబర్ మాసంలో ఒకే రోజులు 61,871 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇంత పెద్ద సంఖ్యంలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి. 

దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను  వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని ప్రధాని మోడీ కోరిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు