మాజీ ఎంపీ, క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ బుధవారం నాడు కారు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకొన్నారు.
మాజీ ఎంపీ, క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ బుధవారం నాడు కారు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకొన్నారు.
న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు అజహరుద్దీన్ ఫ్యామిలీ రాజస్థాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ప్రమాదంలో అజహరుద్దీన్ స్వల్పంగా గాయపడ్డారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని సూర్వాల్ లో కారు ప్రమాదానికి గురైంది. బుధవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.రాజస్థాన్ లోని రణతంబోర్ భవన్ కు అజహరుద్దీన్ కుటుంబం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో మహ్మద్ అజారుద్దీన్ కుటుంబ సభ్యులెవరూ కూడ గాయపడలేదని స్థానికులు చెప్పారు. సంఘట స్థలాన్ని డీఎస్పీ నారాయణ్ తివారీ పరిశీలించారు.
ప్రమాద స్థలం నుండి అజహారుద్దీన్ కుటుంబం రణతంబోర్ లోని హోటల్ కు వేరే కారులో చేరుకొందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం నుండి అజహరుద్దీన్ కుటుంబం క్షేమంగా బయటపడడంతో ఆయన అభిమానులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.