త్వరలోనే రూపాయి కరెన్సీలో విదేశీ వాణిజ్య లావాదేవీలు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Published : Apr 23, 2023, 01:30 PM IST
త్వరలోనే రూపాయి కరెన్సీలో విదేశీ వాణిజ్య లావాదేవీలు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

సారాంశం

విదేశీ వాణిజ్య లావాదేవీలు త్వరలో భారత రూపాయి కరెన్సీలో జరగనున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 

విదేశీ వాణిజ్య లావాదేవీలు త్వరలో భారత రూపాయి కరెన్సీలో జరగనున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.  వివిధ దేశాలకు చెందిన అనేక బ్యాంకులు భారతీయ బ్యాంకులతో ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను ఏర్పాటు చేస్తున్నందున, వ్యాపారులు త్వరలో భారతీయ రూపాయలలో విదేశీ వాణిజ్య లావాదేవీలను నిర్వహించగలరని పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలు (SRVAలు) తెరవడానికి సింగపూర్, యూకే, న్యూజిలాండ్‌తో సహా 18 దేశాల నుంచి 60 కరస్పాండెంట్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయానికి సంబంధించి వివిధ దేశాల్లోని తన సహచరులతో చర్చలు జరుపుతోందని.. అనేక దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి ట్రేడింగ్ కార్యాచరణ త్వరలో ప్రారంభమవుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్, యూకే, కెనడా వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు అడ్వాన్స్‌డ్ దశలో ఉన్నాయని కూడా తెలిపారు. 

యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈఎఫ్‌టీఏ), గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ), యురేషియన్ ఎకనామిక్ యూనియన్ (ఈఏఈయూ) పోల్చదగిన ఒప్పందాల కోసం భారత్‌తో చర్చలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నాయి. భారతదేశంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని నెలకొల్పేందుకు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

టెక్స్‌టైల్స్ పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం రెండో దశపై, వాటాదారులతో విస్తృత సంప్రదింపులు జరిగాయని పీయూష్ గోయల్ తెలిపారు.  పథకం వివరాలను త్వరలోనే ఖరారు చేసి ఆమోదం కోసం అత్యున్నత స్థాయికి తీసుకువస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu