ఫుడ్ పాయిజనింగ్.. చాట్ మసాలా తిన్న 80 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం..

Published : Apr 20, 2023, 03:22 PM IST
ఫుడ్ పాయిజనింగ్.. చాట్ మసాలా తిన్న 80 మందికి  అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం..

సారాంశం

జార్ఖండ్ లో జాతరకు వెళ్లిన ఓ గ్రామానికి చెందిన 80 మంది అస్వస్థతకు గురయ్యారు. జాతరలో చాట్ మసాలా తినడంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని తెలుస్తోంది. 

జార్ఖండ్ : జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన ఒక గ్రామ ఉత్సవంలో కల్తీ 'చాట్ మసాలా' తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారని అధికారులు ఈరోజు తెలిపారు.ఈ సంఘటన బుధవారం సాయంత్రం కర్మతాండ్ పంచాయతీ పరిధిలో జరిగినట్లు వారు తెలిపారు.

భోక్తా జాతరకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత హుచుక్తాన్‌ధాడ్ గ్రామానికి చెందిన ప్రజలు కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. వారిలో ఎనభై మంది, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వీరి పరిస్థితి క్షీణించడంతో రాత్రి 10:30 గంటల సమయంలో షాహిద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కి తీసుకువచ్చారని ఆసుపత్రి మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ యుకె ఓజా తెలిపారు.

ఈ తీర్పు 'గాంధీల కుటుంబానికి చెంపదెబ్బ..!’.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో అతి పిన్న వయస్కురాలు తొమ్మిదేళ్ల పింకీ కుమారి కాగా, పెద్ద వ్యక్తి 44 ఏళ్ల విజయ్ మహ్తో అని ఆయన తెలిపారు. ఆసుపత్రిని సందర్శించిన దండబ్ సివిల్ సర్జన్ డాక్టర్ అలోక్ విశ్వకర్మ ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇంత పెద్ద సంఖ్యలో రోగులు రావడంతో ఎమర్జెన్సీ వార్డులో పడకలు తక్కువగా ఉండడంతో, ఆసుపత్రిలోని ఇతర వార్డుల్లోని ఖాళీ పడకల్లో కొందరికి వసతి కల్పించామని డాక్టర్ ఓజా తెలిపారు. రోగుల రద్దీని ఎదుర్కొనేందుకు అదనపు వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని పిలిపించినట్లు తెలిపారు.ఆసుపత్రిని సందర్శించిన దండబ్ సివిల్ సర్జన్ డాక్టర్ అలోక్ విశ్వకర్మ ఘటనపై విచారణకు ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu