Assam floods : అస్సాంలో వ‌ర‌ద‌ల విలయ తాండ‌వం.. 4 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం.. 8 మంది మృతి..

Published : May 18, 2022, 07:58 AM ISTUpdated : May 18, 2022, 08:09 AM IST
Assam floods : అస్సాంలో వ‌ర‌ద‌ల విలయ తాండ‌వం.. 4 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం.. 8 మంది మృతి..

సారాంశం

అస్సాంను వరదలు వదలడం లేదు. వర్షాల వల్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దీంతో రోడ్లు బ్లాక్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. ఈ వదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది ప్రభావితం అయ్యారు. 

అస్సాంలో వ‌ర‌ద‌లు విళ‌య తాండ‌వం సృష్టిస్తున్నాయి. విప‌రీతంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో లోత‌ట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల 4 ల‌క్ష‌ల మంది ప్ర‌భావితం అయ్యారు. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో ఉదల్‌గురి జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. 

అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా త్రిపుర, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. 26 జిల్లాల్లో 4,03,352 మంది వరదల బారిన పడ్డారు. అత్య‌ధికంగా  96,697 మంది ప్రభావితమైన వ్యక్తులతో కచార్ అత్యంత మొద‌టి వ‌రుస‌లో ఉంది. ఈ రాష్ట్రంలో వాతావ‌ర‌ణ శాఖ ఈ రోజు (మే 18) వరకు భారీ వర్షపాత హెచ్చరిక జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని చెప్పింది. 

Ashok Vihar fire accident : ఢిల్లీలో మ‌ళ్లీ అగ్ని ప్ర‌మాదం.. ఒక‌రు మృతి..

అస్సాంలోని 26 వరద ప్రభావిత జిల్లాల జాబితాను ప్ర‌భుత్వం రూపొందించింది. ఇందులో బజాలీ, బార్పేట, బిశ్వనాథ్, బొంగైగావ్, కచార్, చరైడియో, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగర్, దిమాహాసావో, గోల్పారా, హైలకండి, హోజాయ్, కామరూప్, కర్బి ఆంగ్లాంగ్ వెస్ట్, కరీంగంజ్, కోక్రాఝార్, లఖింపూర్, మజులి, మోరిగావ్, నాగోవ్ లు ఉన్నాయి. 

ఈ 26 జిల్లాల పరిధిలోని 1,089 గ్రామాల్లో 1,900 ఇళ్లు కొన్ని పాక్షికంగా, కొన్ని పూర్తిగా దెబ్బతిన్నాయని ఏఎస్డీఎంఏ తెలిపింది. 89 సహాయక శిబిరాల్లో 39,558 మందికి పైగా ఆశ్రయం పొందారు. వర్షపాతం, కొండచరియలు విరిగిపడటం వల్ల దిమా హసావో జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. అస్సాంలోని బరాక్ లోయ, దిమా హసావో జిల్లాకు రైలు, రహదారి అనుసంధానాలను నిరంతర డౌన్పూర్ విచ్ఛిన్నం చేసింది. మరో వైపు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో ఉన్నారు. 

‘‘ అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని సమీక్షించడానికి సీఎం హిమంత బిశ్వ శర్మతో మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే మోహరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ’’ అని కేంద్ర హోం మంత్రి ట్వీట్ చేశారు. 

Mumbai Blast 1993: 29 ఏండ్ల త‌రువాత‌.. దొరికిన నలుగురు నిందితులు

కొండచరియలు విరిగిపడటంతో త్రిపుర, మిజోరాం, మణిపూర్ లోని కీలక ప్రాంతాలకు మే 15 నుంచి రోడ్డు, రైలు కనెక్టివిటీకి అంతరాయం కలిగింది. మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు కమ్యూనికేషన్ లింక్ కూడా దెబ్బతింది. మంగళవారం NH06 లోని కులియాంగ్ గ్రామంలో తాజా కొండచరియలు విరిగిపడ్డాయని తూర్పు జైంతియా హిల్స్ జిల్లా పోలీసులు తెలిపారు.‘‘ సిల్చార్-రాటాచెరా-ఖలీహ్రియత్ ను బ్లాక్ చేశారు. దీనిని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిక్కుకుపోయిన ప్రయాణీకులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాం ’’ అని పోలీసులు ట్వీట్ చేశారు. 

అరుణాచల్ ప్రదేశ్ కూడా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రభావితమైంది. దీని ప్రభావంతో అనేక రహదారులు బ్లాక్ అయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కింలలో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు మిజోరాం, త్రిపురలో ఒక మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తన తాజా బులెటిన్ లో తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu