కశ్మీర్‌లో ఐదుగురు జవాన్ల వీరమరణం.. ఉగ్రవాదులతో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

Published : Oct 11, 2021, 01:58 PM ISTUpdated : Oct 11, 2021, 02:04 PM IST
కశ్మీర్‌లో ఐదుగురు జవాన్ల వీరమరణం.. ఉగ్రవాదులతో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

సారాంశం

జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నది. ఆ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని తెలియగానే అప్రమత్తమైన మిలిటరీ అక్కడికి చేరి కార్డన్ సెర్చ్ చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే టెర్రరిస్టులు ఆర్మీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారు.  

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర కదలికలు పెరిగాయి. ముఖ్యంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అధికమయ్యాయి. అలాగే, pakistan నుంచి సరిహద్దు గుండా పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు jammu kashmirలోకి చొరబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు పటిష్టంగా కాపలా కాస్తున్నారు. ఉగ్ర సమాచారం అందగానే వెంటనే వెళ్లి చుట్టుముడుతున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. తాజాగా, జమ్ము కశ్మీర్‌లోని poonch సెక్టార్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ ఏరియా నుంచి బయటికి వెళ్లే దారులు మూసేసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తెల్లవారుజామునే మొదలుపెట్టారు. 

భద్రతా వలయం ఉచ్చులో ఉగ్రవాదులు చిక్కారు. కార్డన్ సెర్చ్ చేస్తున్న జవాన్లు సమీపిస్తుండటంతో ఆయుధాలతో వారిపై firingకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలోనే వారు వీరమరణం పొందారు. ఇందులో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నట్టు army అధికారిక ప్రకటన వెల్లడించింది. అలాగే, ఇరువైపుల encounter ఇంకా కొనసాగుతున్నదని వివరించింది.

Also Read: కశ్మీర్‌లో సాధారణ ప్రజల ఊచకోత.. రంగంలోకి సైన్యం, 570 మంది ఉగ్రవాదుల అరెస్ట్

సురన్‌కోటె సబ్ డివిజన్‌లోని ముఘల్ రోడ్ సమీపంలోని అడవుల గుండా ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఎల్‌వోసీ గుండా మనదేశంలోకి చొరబడ్డ ఈ ఉగ్రవాదుల దగ్గర పెద్దమొత్తంలో మందుగుండు, పేలుడు సామగ్రి ఉన్నట్టు సమాచారం ఉన్నదని వివరించారు. చొరబాటులను అనుమానిస్తున్న దారులనూ అధికారులు మూసేస్తున్నారు. చొరబాటు సమాచారం అందగానే ఆర్మీ ఆ ప్రాంతానికి తరలివెళ్లిందని ఓ మిలిటరీ అధికారి వెల్లడించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఈ కాల్పులు జరిగాయని తెలిపారు. ఇంకా ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

అనంత్‌నాగ్, బందిపొరా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక్కో ఉగ్రవాది మరణించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

పల్లెటూరిలో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు.. దేశంలో తొలిసారి అంతర్జాతీయ కార్డియాక్ కాన్ఫరెన్స్
మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi visits Melbourne Cricket Ground