రక్తమోడిన రహదారులు.. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి 

Published : Oct 18, 2022, 12:51 AM IST
రక్తమోడిన రహదారులు.. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి 

సారాంశం

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జఫ్రాబాద్-మహోరా రహదారిపై వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలోఇద్దరు మహిళలు, చిన్నారి సహా ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

మహారాష్ట్ర రహదారులు రక్తమోడాయి.జాల్నా జిల్లా జఫ్రాబాద్-మహోరా రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.అదే సమయంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోరిక్షాను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం క్షతగాత్రులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఆ సమయంలో జాఫ్రాబాద్‌-మహోరా రహదారిపై ఆటోరిక్షా జఫ్రాబాద్‌ వెళుతోంది. అదే సమయంలో జిన్నింగ్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ.. ఆటో రిక్షను  ఢీకొట్టింది. లారీ ఢీకొనడంతో ఆటో ఉన్నవారు ప్రమాదానికి గురయ్యారు.

ఆటో రిక్షాలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారిని ఆటోరిక్షా డ్రైవర్ బాబన్ తిరుఖే (26), పర్వీన్ రాజు షా (25), అలియా రాజు షా (27), ముస్కాన్ రాజు షా (3), కైఫ్ అస్ఫాక్ షా(19)గా గుర్తించినట్లు జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ సఖారం తాడ్వి తెలిపారు. అదే సమయంలో గాయపడిన మరో ఇద్దరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. గుర్తుతెలియని ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ సఖారామ్ తాడ్వి తెలిపారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu