న్యూఢిల్లీ - దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. స్టేషన్ మాస్టర్ గమనించకుంటే..?

Siva Kodati |  
Published : Nov 15, 2023, 08:04 PM IST
న్యూఢిల్లీ - దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. స్టేషన్ మాస్టర్ గమనించకుంటే..?

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తృటిలో మిస్ అయ్యింది. న్యూఢిల్లీ - దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి మూడు భోగీలు దగ్ధం అయ్యాయి. సరాయ్ భూపత్ స్టేషన్ దాటుతుండగా స్లీపర్ కోచ్‌ నుంచి పొగలు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తృటిలో మిస్ అయ్యింది. న్యూఢిల్లీ - దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి మూడు భోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సరాయ్ భూపత్ స్టేషన్ దాటుతుండగా స్లీపర్ కోచ్‌ నుంచి పొగలు వచ్చాయి. దీనిని గమనించిన స్టేషన్ మాస్టర్ వెంటన్ లోకో పైలట్, గార్డ్‌కు సమాచారం అందించారు. వెంటనే ట్రైన్‌ని నిలిపివేయగా.. ప్రయాణీకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక, రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో మూడు బోగీలు దగ్థమైనట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?