
శివసేన నాయకుడు సంజయ్ రౌత్పై ఎఫ్ఐఆర్: మహారాష్ట్రలోని థానేలో బుధవారం (ఫిబ్రవరి 22) శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు తనను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారని రౌత్ ఆరోపించారు. ఈ కేసులో రౌత్ తన ప్రతిష్టను దిగజార్చినందుకు ఎఫ్ఐఆర్ నమోదైంది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్పై థానేలోని కపూర్బావడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని వర్గాలు తెలిపాయి. రౌత్పై థానే మాజీ మేయర్ మీనాక్షి షిండే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఈ సెక్షన్ల కింద సంజయ్ రౌత్పై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 211, 153(ఏ), 500, 501, 502 సెక్షన్ల కింద సంజయ్ రౌత్పై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే తనను చంపేందుకు తనకు కాంట్రాక్ట్ ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపించారని ఓ అధికారి తెలిపారు.
సంజయ్ రౌత్ ఆరోపణలో ఎలాంటి ఆధారం లేదని, ఓ ప్రజాప్రతినిధి పేరును దూషిస్తున్నారని ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపారు. శ్రీకాంత్ షిండే మహారాష్ట్రలోని కళ్యాణ్ నియోజకవర్గం నుండి లోక్సభ ఎంపీ గా ఉన్నారు.
సంజయ్ రౌత్ ఆరోపణలపై షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ తీవ్రంగా మండిపడ్డారు. సానుభూతి పొందేందుకు రౌత్ చౌకబారు వ్యూహాలను అవలంబిస్తున్నాడనీ, ఈ విషయంపై సమగ్ర విచారణ జరగాలి అనడంలో సందేహం లేదనీ, అయితే, రౌత్ చాలా జిమ్మిక్కులను అవలంబిస్తున్నాడని, అందులో వాస్తవం లేదని అన్నారు.
ఎన్నికల సంఘం ఇటీవలే శివసేన కమాండ్ని షిండే వర్గానికి అప్పగించిన విషయం తెలిసిందే.. ఈ నిర్ణయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి భూకంపం వచ్చింది. అధికార, విపక్షాల మధ్య యుద్దం, ఎదురుదాడి సాగుతోంది. శ్రీకాంత్ షిండే తనను హత్య చేసేందుకు రవిచంద్ర ఠాకూర్ అలియాస్ రాజా ఠాకూర్ అనే గ్యాంగ్ స్టర్ కు కాంట్రాక్ట్ ఇచ్చారని సంజయ్ రౌత్ పోలీసులకు లేఖ రాశారు. రాజా ఠాకూర్ గతంలో ఓ హత్యకేసులో కటకటాలపాలయ్యారు.