డిల్లీలో రైతుల ఆందోళన...144 సెక్షన్ అమలు

Published : Oct 02, 2018, 05:04 PM IST
డిల్లీలో రైతుల ఆందోళన...144 సెక్షన్ అమలు

సారాంశం

తమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 23 నుండి హరిద్వార్ నుండి ప్రారంభమైన రైతుల పాదయాత్ర మంగళవారం దేశ రాజధాని డిల్లీకి చేరింది. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ క్రాంతి యాత్ర పేరుతో తలపెట్టిన ఈ మహా పాదయాత్రలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. దీంతో ఆందోళనలు జరిగే అవకాశం ఉందంటూ ఉత్తర ప్రదేశ్- డిల్లీ సరిహద్దుల్లో ఈ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు.   

తమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 23 నుండి హరిద్వార్ నుండి ప్రారంభమైన రైతుల పాదయాత్ర మంగళవారం దేశ రాజధాని డిల్లీకి చేరింది. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ క్రాంతి యాత్ర పేరుతో తలపెట్టిన ఈ మహా పాదయాత్రలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. దీంతో ఆందోళనలు జరిగే అవకాశం ఉందంటూ ఉత్తర ప్రదేశ్- డిల్లీ సరిహద్దుల్లో ఈ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. 

భారీకేడ్లను అడ్డపెట్టి రైతులను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు వాటిని తోసుకుంటూ ముందకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు రైతులపై టియర్ గ్యాస్, వాటర్ ప్రయోగించారు. దీంతో తూర్పు, ఈశాన్య డిల్లీల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతాల్లో  144 సెక్షన్ విధించారు. భారీ భద్రతా దళాలను మొహరించి ఈ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

మొత్తం ఐదు డిమాండ్లతో రైతులు ఈ యాత్ర చేపట్టారు. అయితే రైతు సంఘం నేతలతో చర్చలు జరిపిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతుల 5 డిమాండ్లను నేరవేర్చడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కానీ రుణమాఫీకి కేంద్రం ఒప్పుకోలేదు. దీంతో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!