
ఫరీదాబాద్: మెట్రో రైల్వే స్టేషన్ లో బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించిన యువతిని పోలీసులు కాపాడారు.శనివారం నాడు సాయంత్రం ఆరున్నర గంటలకు ఫరీదాబాద్ సెక్టార్ 28 మెట్రో రైల్వేస్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకొంటానని మహిళ హెచ్చరించడంతో పోలీసులు అక్కడికి చేరుకొన్నారు.
ఆ సమయంలో మెట్రో స్టేషన్ లో ఎస్ఐ ధన్ప్రకాష్ ,కానిస్టేబుల్ సర్పరాజ్ లు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసిన ఎస్ఐ ధన్ప్రకాష్ మెట్రోలో భద్రతాను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను మాటల్లోకి దింపారు.అదే సమయంలో మరో మార్గం గుండా కానిస్టేబుల్ సర్పరాజ్ బాల్కనీ ఎక్కి ఆమె కిందకు దూకకుండా గట్టిగా పట్టుకొన్నారు. సీఐఎస్ఎఫ్ , మెట్రో సిబ్బంది ఆమెను సురక్షితంగా కిందకు దించారు.మహిళ ప్రాణాలను కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు. ఈ వీడియోను ఫరీదాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.