అనుమానం : పెళ్లైన 43రోజులకే భార్య గొంతుకోసి హత్య.. ఆపై దారుణం...

Published : Apr 08, 2021, 12:43 PM IST
అనుమానం : పెళ్లైన 43రోజులకే భార్య గొంతుకోసి హత్య.. ఆపై దారుణం...

సారాంశం

కొత్తగా పెళ్లైన జంట జీవితంలో అనుమానం మంటలు రేపింది.  భర్తను భార్య గొంతు కోసి దారుణంగా చంపేసిన హంతకుడిగా మార్చింది. అమాయకురాలైన భార్యకు రెండు పదులు కూడా నిండకుండానే నూరేళ్లూ నిండిపోయేలా చేసింది. చివరికి ఆ భర్త కూడా ఆత్మహత్య చేసుకునేలా చేసింది. 

కొత్తగా పెళ్లైన జంట జీవితంలో అనుమానం మంటలు రేపింది.  భర్తను భార్య గొంతు కోసి దారుణంగా చంపేసిన హంతకుడిగా మార్చింది. అమాయకురాలైన భార్యకు రెండు పదులు కూడా నిండకుండానే నూరేళ్లూ నిండిపోయేలా చేసింది. చివరికి ఆ భర్త కూడా ఆత్మహత్య చేసుకునేలా చేసింది. 

తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. సేలం జిల్లా వీరాణం ఒరత్తరు పట్టికి చెందిన తంగరాజ్ (33) రైతు. కేబుల్ ఆపరేటర్ గా కూడా పనిచేస్తున్నాడు. 

తంగరాజ్ కు కన్నంకురిచ్చి గ్రామానికి చెందిన మోనీషా(19) తో 43 రోజుల క్రితం వివాహమైంది. తంగరాజ్ కు ఊర్లో ఎకరం పొలం ఉంది. దాని పక్కనే ఇంటిని నిర్మించుకుని అక్కడే ఉంటున్నారు ఈ కొత్త జంట. 

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వారి ఇంటి తలుపులు ఎంతకీ తెరుచుకోలేదు. దీంతో అనుమానించిన బంధువులు తలుపులు పగలగొట్టి, లోనికి వెళ్లారు. అక్కడ గొంతుకోసి హతమార్చిన స్థితిలో మోనిషా, కేబుల్ వైరుకు ఉరిపోసుకుని తంగరాజ్ వేళాడుతూ కనిపించారు. షాక్ అయిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న వీరాణం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయి.  గత నెల 24వ తేదీన మోనిషా అత్త మోహన కొడుకు వరుసకు బావ ఒకతను వీళ్లింటికి వచ్చి వెళ్లినట్లు తేలింది.

ఆ రోజు తన బర్త్ డే  కావడంతో కేక్ ఇవ్వడానికి అత్త కొడుకు వచ్చాడు. అయితే తంగరాజ్ మాత్రం అనుమానపడ్డాడు. తామిద్దరి వయసులో కూడా చాలా తేడా ఉండడంతో ఆ అనుమానం మరింత పెరింగింది. 

దీనికి తోడు మోనిషా సోదరి.. అత్త మోహన మరో కొడుకుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉండటాన్ని తంగరాజ్ చూశాడు. అంతే అతనిలోని అనుమానం పెనుభూతంగా మారింది. 

ఈ అనుమానంతోనే భార్య మోనిషాను గొంతుకోసి హతమార్చి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ముందుగా తంగరాజ్‌ విషం తాగి, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్లు విచారణలో వెలుగు చూసిందని వీరాణం పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?