కొలంబోలో బాంబు పేలుళ్లు.. అప్రమత్తమైన భారత ప్రభుత్వం

By Siva KodatiFirst Published Apr 21, 2019, 11:38 AM IST
Highlights

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. విషయం తెలిసిన వెంటనే విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. 

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. విషయం తెలిసిన వెంటనే విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు.  ఈ ఘటనపై శ్రీలంకలోని భారత హైకమిషనర్‌తో మాట్లాడామని చెప్పారు. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సుష్మ తెలిపారు.

భారతీయుల కోసం కొలంబోలోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు శ్రీలంకలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. +94 777903082, +94112422788, +94 112422789, +94 777902082, +94772234176 నంబర్లను సంప్రదించాలని కోరింది.

click me!