కొలంబోలో బాంబు పేలుళ్లు.. అప్రమత్తమైన భారత ప్రభుత్వం

Siva Kodati |  
Published : Apr 21, 2019, 11:38 AM IST
కొలంబోలో బాంబు పేలుళ్లు.. అప్రమత్తమైన భారత ప్రభుత్వం

సారాంశం

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. విషయం తెలిసిన వెంటనే విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. 

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. విషయం తెలిసిన వెంటనే విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు.  ఈ ఘటనపై శ్రీలంకలోని భారత హైకమిషనర్‌తో మాట్లాడామని చెప్పారు. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సుష్మ తెలిపారు.

భారతీయుల కోసం కొలంబోలోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు శ్రీలంకలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. +94 777903082, +94112422788, +94 112422789, +94 777902082, +94772234176 నంబర్లను సంప్రదించాలని కోరింది.

PREV
click me!

Recommended Stories

Fact Check: ప్రధాని మోదీ రాజీనామా చేశారా.? వైరల్ లేఖపై కేంద్రం క్లారిటీ.. అసలు నిజం ఇదే
Vande Mataram Bill: వందేమాతరం పాడేప్పుడు ఈ తప్పులు చేస్తే.. జైలుకు వెళ్లాల్సిందే.