Kerala Ex-teacher Arrest: తన 30 ఏండ్ల సర్వీసులో ఓ కీచకోపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
Ex-teacher & CPIM councillor- Sasi Kumar arrested: విద్యాబుద్దులు నెర్పించాల్సిన ఓ గురువు.. కామంతో కండ్లుమూసుకుపోయి విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడ్డాడు. తన 30 ఏండ్ల సర్వీసులో 60 మందికి పైగా విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కీచకోపాధ్యాయుడి బాగోతం ప్రస్తుతం సంచలనంగా మారింది. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్ కావడంతో సర్వత్రా ఆ టీచర్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వస్తున్నాయి. 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతోపాటు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కేరళ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. సీపీఎం కౌన్సిలర్గా ఉన్న కేవీ శశికుమార్.. మలప్పురం మున్సిపాలిటీలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు. ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న సమయంలో విద్యార్థినులను వేధింపులకు గురి చేసినట్టు శశికుమార్కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదైంది. అయితే.. దాదాపు 50 మందికి పైగా కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ అండ కారణంగా ఈ దుర్మార్గుడిపై ఏవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. అయితే, ఇటీవల ఆయన రిటైర్డ్ అయినట్టు ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న ఓ మాజీ విద్యార్థిని ఒకరు అతడి లీలలను బయటపెట్టింది. మీటూ (MeToo) ఆరోపణలు చేస్తూ పలు వ్యాఖ్యలు చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అ క్రమంలోనే మరింత మంది విద్యార్థులు ఈ రకమైన ఆరోపణలు చేశారు. ధైర్యం చేసిన మాజీ విద్యార్థులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. ఈ పరిణామాలతో శివకుమార్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది.
అయితే, కుమార్పై చాలాసార్లు ఫిర్యాదులు చేసినా పాఠశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీనా చెప్పారు. "అతను కొంతమంది పిల్లలను అత్యంత దారుణంగా దుర్భాషలాడాడు. ఆమె ఛాతీపై కొరికిన ఓ చిన్నారిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. 2019లో పాఠశాల కార్పొరేట్ మేనేజర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు ఎవరూ పోలీసులను ఆశ్రయించే సాహసం చేయలేదు’’ అని బీనా అనే న్యాయవాది చెప్పారు. పాఠశాల వెలుపల కూడా అతను తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ పూర్వ విద్యార్థి సభ్యులు ఒక మహిళ నుండి మరో ఫిర్యాదును కూడా స్వీకరించారు. అయితే, కుమార్పై తమకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని పాఠశాలలోని ఓ వ్యక్తి చెప్పటం గమనార్హం.
“నేను గత ఐదు సంవత్సరాలుగా పాఠశాలలో ఉన్నాను. ఆరోపణ చాలా తీవ్రమైనది మరియు అటువంటి తీవ్రమైన సమస్యపై మేము ఖాళీగా కూర్చోము. కానీ మాకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు” అని అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి చెప్పాడు. శుక్రవారం, ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మలప్పురం-పాలక్కాడ్ రహదారిని దిగ్బంధించింది.. ఈ నిరసన పోలీసుల లాఠీచార్జితో ముగిసింది. “ఎయిడెడ్ పాఠశాలలో పూర్తి సమయం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు మరియు రాష్ట్ర జీతం తీసుకుంటూనే, కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి, గెలిచి 2005 నుండి 2010 వరకు మరియు 2015 నుండి ఇప్పటి వరకు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. అతను ఎప్పుడూ పాఠశాల నుండి సెలవు తీసుకోలేదు” అని సెయింట్ గెమ్మా స్కూల్ మాజీ PTA ప్రెసిడెంట్ అయిన IUML నాయకుడు హరిస్ అమియన్ అన్నారు. ఈ కేసు తర్వాత సీపీఎం తన శాఖ కమిటీ నుంచి కుమార్ను సస్పెండ్ చేసింది. ఈ అంశంపై విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సాధారణ విద్యాశాఖ మంత్రి వి శివన్కుట్టి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జీవన్ బాబు కెను కోరారు.