
వారిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమికులు విడిపోయారు. ఎవరిదారి వారు చూసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆ యువతి కుటుంబ సభ్యుల ఆమెకు వేరే యువకుడిని చూసి పెళ్లి నిశ్చయించారు. అతడితో పెళ్లి జరుగుతుండగా మాజీ ప్రేమికుడు కల్యాణ మండపంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు చేసిన పనికి ఆ పెళ్లి కొడుకు తనకు ఈ పెళ్లి వద్దని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
ఉత్తరప్రదేశ్ లోని గాజిపుర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి, అదే ఊరికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అయితే పలు కారణాల వల్ల వారు విడిపోయారు. ఎవరి జీవితం వారు ముందుకెళ్లాలని అనుకున్నారు. అయితే ఆ యువతి తల్లిదండ్రులు వేరే యువకుడితో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 17న పెళ్లి జరిపించాలని నిర్ణయించారు.
తమిళనాడులో విషాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురు మృతి, మరొకరికి గాయాలు
పెద్దల నిర్ణయం ప్రకారమే గత బుధవారం పెళ్లి కోసం ఏర్పాట్లు చేశారు. అందరూ సంతోషంగా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మండపంపైకి ఎక్కి పూజలు నిర్వహిస్తున్నారు. వరుడు వధువు మెడలో తాళి కట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో మాజీ ప్రియుడు అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు. మండపంపైకి ఎక్కి ఆ వధువు నుదుట బొట్టు పెట్టాడు. దీనిని చూసి పెళ్లికి వచ్చిన అతిథులంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే.. ఎందుకంటే ?
ఇదంతా గమనించిన ఆ పెళ్లి కొడుకు అసహనం వ్యక్తం చేశాడు. తనకు ఈ పెళ్లి వద్దని ఆ మండపం దగ్గరే తేల్చి చెప్పాడు. దీంతో ఆ కల్యాణ మండపం నుంచి పెళ్లి కొడుకుతో పాటు అతడి తరఫు చుట్టాలు, స్నేహితులు అంతా వెనక్కి వెళ్లిపోయారు. కాగా.. సిందూరం పెట్టిన ఆ మాజీ ప్రియుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని గ్రామస్తులు అంతా పట్టుకొని చితకబాదారు. తరువాత పోలీసులని పిలిచి, వారికి నిందితుడిని అప్పజెప్పారు. అయితే గతంలో కూడా అతడు ఆ యువతి పెళ్లినట్టు చెడగొట్టాడని స్థానికులు పేర్కొన్నారు.